ఉద్యానానికి ఊతమిచ్చేనా!
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది రైతులు ప్రయత్నిస్తున్నారు.
మూడేళ్లుగా పెండింగ్లో దరఖాస్తులు
సాగులో అరటి తోట
పరిగి, వికారాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది రైతులు ప్రయత్నిస్తున్నారు. ఆయిల్పామ్ తోటలతో పాటు ఇతర వాటిపైనా దృష్టి సారిస్తున్నారు. 14వేల ఎకరాల్లో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, అరటి, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, సపోటా తదితర రకాలు సాగులో ఉన్నాయి. కూరగాయల సాగుతో భాగ్యనగర ప్రజల అవసరాలు కూడా తీరుతున్నాయి. రోజురోజుకు సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు సహకారం కోసం వేయి కళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో ఏళ్లుగా నిరీక్షించామని కనీసం ఇప్పుడైనా ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసేందుకు ఉపయోగపడే బిందు, తుంపర పరికరాలు పంపిణీపై నీలినీడలు అలముకున్నాయి. రైతులు చేసిన విన్నపాలు బుట్టదాఖలే అయ్యాయి. రాయితీలను కొనసాగిస్తామని శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. ఆర్థిక సంవత్సరం దగ్గరపడుతున్న తరుణంలో జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
11వేల ఎకరాల్లో: కొత్త తోటల సాగుకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల పరిధిలో యాసంగిలో 12వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు అంచనా ఉండగా 17,250 మంది రైతులు ఇప్పటివరకు 11వేల ఎకరాలకు పైగా పండిస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నారుమళ్లను పోసుకుంటున్నారు. ప్రైవేట్ నర్సరీల్లోనూ మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. 1.17లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల అంచనా. గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, తాండూరు, వికారాబాద్, శంషాబాద్ తŸదితర ప్రాంతాల్లోని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.
3,150మంది నిరీక్షణ
ఉద్యాన, కూరగాయ పంటలను సాగు చేస్తున్న దాదాపు 3,150 మంది రైతులు మూడేళ్ల క్రితం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు వాటి అతీగతి లేకుండా పోయింది. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 10,500 మంది రైతులు బిందు పరికరాలను వినియోగిస్తూ పండిస్తున్నారు. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగిస్తే మరికొంత మంది పేద రైతులకు ప్రయోజనం కలగనుంది. మార్కెట్లో సెట్టు ధర రూ.25వేల వరకు పలుకుతోంది.
ప్రధాన పంటలు
జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు ఉన్నాయి. ఇవి దాదాపు అన్ని రకాల పంటలకు అనుకూలమైనవి. ప్రధానంగా ఉల్లి, టమాట, వంగ, మిరప, ఆలుగడ్డ, కీర, బెండ, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్, కాకర, బీర, సొరకాయ కూడా పండిస్తున్నారు. కొద్దిపాటి భూమి కలిగిన రైతులు మాత్రం ఎక్కువగా పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి కూర, పాయిల్ కూర సాగు చేస్తున్నారు. కిలో మెంతికూర మార్కెట్లో రూ.60-80కి విక్రయిస్తుండగా పాలకూర పావుకిలో రూ.20కి అమ్ముతున్నారు.
ఆయిల్పామ్కు తొలి ప్రాధాన్యం
- మహమ్మద్ అబ్దుల్ సత్తార్, జిల్లా ఉద్యానాధికారి
ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు పరికరాల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. మిగతా వాటికి ప్రభుత్వ అనుమతి రాగానే అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్