విధి వెంటాడింది.. మృత్యువు కబలించింది
గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందింది. లాస్యనందిత ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రహదారి ప్రమాదంలో ఆమెను మృత్యువు కబలించింది.
యువ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో విషాదం
కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా..
ఈనాడు, హైదరాబాద్, కంటోన్మెంట్, కార్ఖానా, ముషీరాబాద్, రాంనగర్ న్యూస్టుడే
తండ్రి సాయన్నతో లాస్యనందిత
మూడు పదుల వయసు.. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో అరంగేట్రం.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వైనం.. చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టి.. అర్ధాంతరంగా తనువు చాలించింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత (37).
గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందింది. లాస్యనందిత ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రహదారి ప్రమాదంలో ఆమెను మృత్యువు కబలించింది. ఆమె అకాల మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పటాన్ చెరువు సమీపంలోని బాహ్యవలయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె విగతజీవిగా మారడం అందరిని తీవ్ర దిగ్భా్రంతికి గురిచేసింది.
సంఘటన స్థలం నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీకి తరలించగా... పోస్ట్మార్టం అనంతరం కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు. అప్పటికే వేలమంది చేరుకున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే లాస్య ఇకలేరన్న సమాచారంతో కంటోన్మెంట్్, కవాడిగూడ డివిజన్లో విషాదం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సన్నిహితులు కార్ఖానాలోని ఆమె నివాసంవద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఏడాది వ్యవధిలో ఎమ్మెల్యేగానే లాస్యనందిత, ఆమె తండ్రి సాయన్న మరణించడంతో వారి కుటుంబంలో అంతులేని విషాదం ఆవరించింది.
ప్రస్థానమిలా: సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో పదోతరగతి, నారాయణగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్, మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ చదివారు. సాయన్న రాజకీయ వారసురాలిగా 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 2016లో కవాడిగూడ కార్పొరేటర్గా గెలిచారు.
కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రోజున బొట్టుపెడుతూ..
చిన్న వయసులోనే శాసన సభ్యురాలిగా..
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వారసురాలిగా లాస్య నందితను భారాస ఎంపిక చేసింది. అప్పటికే కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారాస అధిష్ఠానం అవకాశం ఇవ్వగా.. విజయం సాధించింది.
ఎప్పుడూ ప్రజల వెంటే..: కవాడిగూడ కార్పొరేటర్గా 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. భారాస డివిజన్ ఇన్ఛార్జిగా ప్రజల చెంతే మెలిగారు. ఎమ్మెల్యే సాయన్నకు అనారోగ్య సమస్యలతో తండ్రి తరఫున నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
లాస్య నందిత పార్థివదేహం వద్ద ఆమె సోదరి, బంధువులను ఓదారుస్తున్న ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి సబిత
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి..
లాస్యనందిత తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంజినీరింగ్ చదువుకున్న ఆమెకు ఊహ వచ్చేప్పటికే తండ్రి సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. సాయన్నకు ముగ్గురూ కుమార్తెలే కావడంతో ఒక్కరినైనా రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దుదామని 2014లో నిర్ణయించారు. పెద్ద కుమార్తె నమ్రతకు పెళ్లి కావడం, రెండో కుమార్తె నివేదితను రాజకీయాల్లోకి తీసుకొద్దామనుకున్నా.. అందరికంటే చిన్నదైన లాస్యనందిత హుషారుగా ఉండడంతో ఆమెను రాజకీయరంగ ప్రవేశం చేయించారు. కంటోన్మెంట్ బోర్డుకు 2015లో జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను నిలబెట్టారు.
అంతిమయాత్రలో ప్రముఖులు...
లాస్యనందిత అంతిమయాత్రలో కుటుంబసభ్యులతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కేఏ పాల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
సాయన్న రుణం తీర్చుకోవడానికి..
సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేక నిధులను కేటాయించి ఈస్ట్ మారేడుపల్లిలోని హిందు శ్మశానవాటికలో పలు అభివృద్ధి పనులు చేశారు. ఆయన రుణం తీర్చుకోవడానికి శ్మశానవాటిక కమిటీ సభ్యులు సాయన్నపై అభిమానంతో లాస్యనందిత అంత్యక్రియలకు సంబంధించిన దహన సంస్కారాల ఖర్చును సొంతంగా భరించారు.
అంతిమయాత్రలో బంధువులు, భారాస శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు
ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చిన స్థానికులు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సంతాప సూచకంగా గాలిలోకి పోలీసుల కాల్పులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే