నిలిపిన చెత్త టిప్పర్ను ఢీకొని పెయింటర్ దుర్మరణం
శామీర్పేట- కీసర అవుటర్ రింగ్ సర్వీస్ రోడ్డుపై చెడిపోయిన చెత్త టిప్పర్ను ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి వేయటంతో చీకట్లో కనిపించక ఓ ద్విచక్రవాహనదారుడు వెనక నుంచి ఢీకొనటంతో దుర్మరణం పాలైన సంఘటన శామీర్పేట ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
కృష్ణ
శామీర్పేట, న్యూస్టుడే: శామీర్పేట- కీసర అవుటర్ రింగ్ సర్వీస్ రోడ్డుపై చెడిపోయిన చెత్త టిప్పర్ను ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి వేయటంతో చీకట్లో కనిపించక ఓ ద్విచక్రవాహనదారుడు వెనక నుంచి ఢీకొనటంతో దుర్మరణం పాలైన సంఘటన శామీర్పేట ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శామీర్పేట ఎస్ఐ చంద్రశేఖర్, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్ డివిజన్ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన తిప్పరమైన కృష్ణ (33) పెయింటర్, వెల్డర్గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో పనులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై శామీర్పేట- కీసర అవుటర్ సర్వీస్ రోడ్డు మీదుగా ఇంటికి బయలుదేరాడు. దారిలో ఉప్పరిపల్లి గ్రామం వద్ద సర్వీస్ రోడ్డుపై ఓ చెత్త టిప్పర్ చెడిపోవటంతో రోడ్డుపై ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిలిపారు. చీకట్లో టిప్పర్ కనిపించక వెనుక నుంచి ఢీకొనటంతో హెల్మెట్ పెట్టుకున్నా ఊడిపోయి తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణ మృతి చెందటంతో అతడి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. శామీర్పేట ఎస్ఐ చంద్రశేఖర్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయిలకు వల.. యువకుడి అరెస్టు
నారాయణగూడ, న్యూస్టుడే: నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలను తెరిచి, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపిస్తూ అమాయక యువతులను ట్రాప్ చేస్తున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలిక(17)కు ఆన్లైన్లో పరిచయమైన ఓ యువకుడు మొదట స్నేహపూర్వకంగా చాటింగ్ చేశాడు. ఆ తర్వాత డబ్బు ఇవ్వాలని, తన సెల్ఫోన్ రీఛార్జి చేయాలంటూ బెదిరించేవాడు. లేకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను వైరల్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాలిక ఇన్స్టా ఖాతాలోని చిత్రాలను తస్కరించి మార్ఫింగ్ చేసి ఆమె బంధువులకు పంపాడు. దాంతో ఆ బాలిక కొంత డబ్బు పంపినా వేధించడం ఆపలేదు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. నిందితుడు దిల్లీలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి (29)గా గుర్తించి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.
బైక్లపై మోజుతో చోరీలు
ఖైరతాబాద్, న్యూస్టుడే: యమహా ఆర్ఎక్స్ 100 బైకుపై మోజుతో వాటిని చోరీ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. ఖైరతాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఓ న్యాయమూర్తి వద్ద డ్రైవర్గా పనిచేసే మల్లేశ్ ఆనంద్నగర్ కాలనీలో ఉంటున్నాడు. డ్రైవర్ సకాలంలో విధులకు వచ్చేలా న్యాయమూర్తి తన యమహా బైకు ఇచ్చారు. జనవరి 11న రాత్రి డ్రైవర్ తన ఇంటి ముందు బైక్ పార్కు చేయగా మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు ఎర్రమంజిల్లోని హిల్కాలనీకి చెందిన మైనర్(17) చోరీ చేసినట్లు, అతనికి ఓ యువకుడు(18) సహకరించినట్లు తేలింది. వారిచ్చిన సమాచారంతో మొత్తం 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఇంజినీరింగ్, ఇంటర్ చదువుతున్నారు.
తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో రవికుమార్ డిస్టిలరీస్ అనే సంస్థను మోసం చేసి రూ.29 కోట్లు కొట్టేసిన కేసులో 2013 నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు సాంబశివయ్యార్ స్వామినాథన్ను సీఐడీ పోలీసులు ఈనెల 18వ తేదీన అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ షీకాగోయల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రవికుమార్ డిస్టిలరీస్ సంస్థ షేర్ల వ్యాపారానికి సహాయం చేస్తానంటూ అనిల్ బేణి ప్రసాద్ అగర్వాల్ తదితరులు రూ.29 కోట్ల మోసానికి పాల్పడ్డారు. 2013లో నాచారం పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా సీఐడీకి బదిలీ అయింది. చెన్నై విజయనగర్ చిరునామాతో ఉన్న ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఒన్సోర్స్ ఐడియాస్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ సాంబశివయ్యర్ స్వామినాథన్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఎల్బీ నగర్ న్యాయస్థానం అప్పట్లోనే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ పరారీలోనే ఉన్నాడు. స్వామినాథన్ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన సీఐడీ బృందం నిందితుడ్ని అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.