logo

అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుడి మృతి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలిలోని ప్రగతి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారులు మృతి చెందారు.

Published : 28 Feb 2024 11:55 IST

హైదరాబాద్‌: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలిలోని ప్రగతి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారులు మృతి చెందారు. ఓ ఇంట్లోని గదిలో తల్లి మృతదేహం కనిపించగా.. కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను విజయ(70), ఆమె కుమారుడు శ్రీధర్(45)గా గుర్తించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని