ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. భారీగా పెరగనున్న హెచ్ఎండీఏ పరిధి
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధి భారీగా పెరగనుంది. ప్రాంతీయ రింగ్రోడ్డు లోపలి ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. కొత్తగా అనేక ప్రాంతాలు ఇందులోకి రానున్నాయి.
రాజధాని నగరంతో 20 చిన్న పట్టణాలకు అనుసంధానం
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధి భారీగా పెరగనుంది. ప్రాంతీయ రింగ్రోడ్డు లోపలి ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. కొత్తగా అనేక ప్రాంతాలు ఇందులోకి రానున్నాయి. ఫలితంగా క్రమపద్ధతితో కూడిన అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. 2008 ఆగస్టు 25న హెచ్ఎండీఏ ఏర్పాటైంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, భువనగిరి, మెదక్, సిద్దిపేట్ జిల్లాల్లోని 70 మండలాలు, 1032 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా హెచ్ఎండీఏతో అనుసంధానమై ఉన్నాయి. మొత్తం పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు.. తాజాగా ప్రాంతీయ రింగ్రోడ్డులోని లోపల ప్రాంతాల వరకు విస్తరించనుండటంతో దీని పరిధి మరింత పెరగనుంది. ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది.
పైవంతెనలు, అనుసంధాన రోడ్లు
ఆయా జిల్లాల్లోని భారీ భవంతులు, లేఅవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులు ఇస్తోంది. ఈ క్రమంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అనుసంధాన రోడ్లు చేపడుతుంది. తాజాగా పరిధిని ఆర్ఆర్ఆర్కు పెంచనుండటంతో మహానగరంతో దాదాపు మరో 20 చిన్న పట్టణాలకు అనుసంధానం కలుగుతుంది. ఇప్పటికే ఔటర్ వరకు అర్బన్, తర్వాత పెరీఅర్బన్, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించనుండటంతో భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. మొత్తం 340 కి.మీ.మేర ఆర్ఆర్ఆర్ పరిధిలోకి వచ్చే తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూరు, షాద్నగర్, చేవెళ్ల, కౌలంపేట్, నర్సాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, షాద్నగర్, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి వరకు హెచ్ఎండీఏ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలంగాణతో అనుసంధానమైన అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ధికి సైతం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రక్పార్కులు లాంటివి ఈ రెండు రహదారుల చుట్టూ విస్తరించనున్నాయి. ఇప్పటికే హెచ్ఎండీఏలో ఉన్న సిబ్బంది సంఖ్య చాలక పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో 340 కి.మీ. వరకు పరిధి పెరిగితే అదనపు సిబ్బంది అవసరం అవుతారు. దీనికి కూడా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్