logo

కొడుకు ప్రాణం తీసిన తండ్రి]

మద్యం మత్తులో తరచూ డబ్బులివ్వాలని వేధిస్తున్న కొడుకును తండ్రి కొట్టి చంపిన ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధి మునగనూరులో చోటుచేసుకుంది

Updated : 29 Feb 2024 08:13 IST

ఎల్బీనగర్‌ పరిధి మునగనూరులోఘటన

 హతుడు వినోద్‌ కుమార్‌ గౌడ్‌

 హయత్‌నగర్‌: మద్యం మత్తులో తరచూ డబ్బులివ్వాలని వేధిస్తున్న కొడుకును తండ్రి కొట్టి చంపిన ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధి మునగనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరిజిల్లా దండు మల్కాపురానికి చెందిన కలగోని శ్రీనివాస్‌గౌడ్‌ (54) హయత్‌నగర్‌లోని ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొడుకు పుట్టగానే మొదటి భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. మునగనూరు పరిధి శ్రీరామానుజ నగర్‌లో రెండోభార్య మాధవి, కుమార్తెతో  నివసిస్తున్నాడు.మొదటి భార్య కుమారుడైన  వినోద్‌కుమార్‌ గౌడ్‌ (28), భార్య ప్రవళిక, రెండేళ్ల కుమార్తెతో కలిసి మునగనూరు ద్వారకానగర్‌లో ఉంటున్నారు.వినోద్‌  క్యాబ్‌ డ్రైవర్‌. స్వగ్రామంలోని 30 గుంటల భూమి విషయమై  తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి  మద్యం మత్తులో కుమారుడు.. తండ్రి వద్దకు వచ్చి పారతో దాడి చేసేందుకు యత్నించాడు. ఇంతలో ఫోను రావడంతో పార పడేసి ఫోను మాట్లాడుతున్నాడు. తనను చంపుతాడని భయపడిన తండ్రి.. అదే పారతో కుమారుడిపై దాడి చేశాడు. వినోద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని