తియ్యని విషం
పేరుకే అంతర్జాతీయ సంస్థ. తయారుచేసిన చాక్లెట్లకు మాత్రం ఆస్థాయి లేదు. నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల తాజాగా ఇచ్చిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
‘తెల్ల పురుగు’ నమూనాపై ప్రయోగశాల నివేదిక
నాసిరకం బట్టర్, మయో, సాస్లపైనా ఫిర్యాదులు
కల్తీ నియంత్రణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: పేరుకే అంతర్జాతీయ సంస్థ. తయారుచేసిన చాక్లెట్లకు మాత్రం ఆస్థాయి లేదు. నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల తాజాగా ఇచ్చిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. చాక్లెట్ నమూనాను పరీక్షించిన నిపుణులు.. అవి తినేందుకు పనికిరావని తేల్చి చెప్పారు. ఈ నెల 12న అమీర్పేట మెట్రో స్టేషన్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ చాక్లెట్ను కొనుగోలు చేసిన వ్యక్తి.. అందులో తెల్లని పురుగును గుర్తించాడు. వాటి నమూనా పరీక్ష ఫలితం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదే మాదిరి.. నగరంలో నాసిరకం వెన్న ముద్దలు, మయోనీజ్, అల్లం వెల్లుల్లి మిశ్రమం, సాస్లు, ఇతరత్రా పదార్థాలు తయారవుతున్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. నగర ఆహార భద్రత నియంత్రణాధికారుల(ఎఫ్ఎస్ఓ) నిర్లక్ష్యంతోనే కల్తీ ఆహారం విస్తరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని పదార్థాలపై..: బట్టర్.. ఏ వయసు వారైనా అన్ని వేళలా తినగలిగే ఇడ్లీ పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. బట్టర్ ఇడ్లీ పేరుతో.. కొందరు వ్యాపారులు ఇడ్లీలను నాసిరకం వెన్నతో ముంచెత్తుతున్నారు. నగరవాసులు ఆప్యాయంగా తినే బిర్యానీలో, మాంసాహార వంటకాల్లో, పిజ్జాలు, బర్గర్లు, రొట్టెలు, ఇతరత్రా ఆహార పదార్థాల్లోనూ బట్టర్ దట్టించడం సాధారణమైంది. ఇటీవల ఆ విషయమై ఫిర్యాదులు వస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఆహార విభాగం అధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు.
మయో.. మయోనీజ్ను ముద్దుగా మయో అని పిలుస్తారు. కోడిగుడ్డు, నూనె, ఇతర వస్తువులతో ఆ పదార్థం తయారవుతుంది. కొందరు వ్యాపారులు అపరిశుభ్రతమధ్య తయారుచేస్తుండటంతో విషంలా మారుతుంది. ప్రతినెలా మయోనీజ్ తిని వాంతులు, విరేచనాలయ్యాయంటూ జీహెచ్ఎంసీకి కనీసం పది ఫిర్యాదులు అందుతుండటమే అందుకు నిదర్శనం.
కోవా.. తియ్యని మిఠాయిల్లో ఉపయోగించే కోవాను.. పాతబస్తీ, కాటేదాన్, రాజేంద్రనగర్, తదితర శివారు ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు ఆందోళనకర పద్ధతిలో తయారు చేస్తున్నారని జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం తనిఖీల్లో వెల్లడైంది.
రంగులు.. తందూరి చికెన్, చికెన్ 65, బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి ఆహార పదార్థాల్లో ఎర్రని రంగు మోతాదుకు మించి ఉపయోగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ పరీక్షల్లో తేలుతోంది. ఆయా నమూనాలను రాష్ట్ర ప్రయోగశాలలో పరీక్షించిన ప్రతిసారీ.. అనారోగ్యకరమని తేలుతున్నట్లు అధికారులు గుర్తుచేస్తున్నారు. బేకరీల్లోని లడ్డూలు, రంగుల మిఠాయిల్లోనూ విషం లాంటి రంగులను ఎక్కువగా కలుపుతున్నారని అధికారులు చెబుతున్నారు
చర్యలేవీ.. హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాల్లోని తినుబండారాల తనిఖీలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పరీక్షించిన నమూనాల్లో నాసిరకం, అనారోగ్యకరంగా తేలిన ఆహార పదార్థాల విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవట్లేదు. కల్తీ జరిగిందని, పాచిపోయిన బిర్యానీ వడ్డించారని, కూరలో పురుగులున్నాయని వచ్చే ఫిర్యాదులను పట్టించుకోకుండా.. హోటళ్ల యజమానులతో కుమ్మక్కవుతున్నారనే ఫిర్యాదులున్నాయి.
కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా అరెస్టు
బేగంపేట, న్యూస్టుడే: నాసిరకం అల్లం, వెల్లుల్లి, రసాయనాలు, సిట్రిక్ యాసిడ్, రంగులు కలిపి ఆరోగ్యానికి హాని కలిగించే పేస్ట్ తయారు చేసి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.5లక్షల విలువైన కల్తీ పేస్ట్, ముడి సరకుని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు. గుజరాత్కు చెందిన రహీం చరణీయ(36) జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి బేగంపేటలో ఉంటున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్పల్లిలో దక్కన్ ట్రేడర్స్ పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. బేగంపేట పాటిగడ్డలో నివసించే పాండురంగారావు(72)ను ఏజెంట్గా నియమించి పేస్ట్ను బేగంపేటలో నిల్వ చేస్తూ అజయ్కుమార్ ఆహీర్(43), ప్రదీప్ సంక్లా(29)ల ద్వారా, నగరంలోని హోల్సేల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంలో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రాజేంద్రనగర్లోని తయారీ కేంద్రం, పాటిగడ్డలోని నిల్వ కేంద్రం, బేగంబజార్లోని హోల్సేల్ దుకాణాలపై దాడి చేశారు. 700 కిలోల పేస్ట్, 625 కిలోల నాణ్యతలేని వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం, 150 కిలోల రాళ్ల ఉప్పు, రసాయనాలు, రంగు డబ్బాలు, ప్యాకింగ్ యంత్రాలు, గ్రైండర్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను బేగంపేట పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు