TSSPDCL: నేటి నుంచి సున్నా కరెంట్ బిల్లులు
నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది.
కొత్త బిల్లింగ్ యంత్రాలు.. సాఫ్ట్వేర్లో మార్పులు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది.
ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. టెస్టింగ్ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశారు. అంత సక్రమంగా ఉన్నట్లు ఇంజినీర్లు నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 1 శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకైనా సరే ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి.. మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని ఆదేశించారు.
నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 48.06 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రజాపాలనలో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి గృహజ్యోతికి 19.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రకటించడంతో.. ఇప్పటివరకు 11 లక్షల మందే ఈ పథకానికి అర్హులుగా తేలారు.
అర్హత ఉండి సున్నా బిల్లు రాకపోతే..
మున్సిపల్, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆహార భద్రత కార్డు, దీనికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్తు కనెక్షన్ల నంబర్ను దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వీటిని విద్యుత్తు సిబ్బంది పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. తర్వాతి నెల నుంచి సున్నా బిల్లు వస్తుంది. అవసరమైతే సవరించిన బిల్లు జారీచేస్తారు. వీరు బిల్లు కట్టలేదని ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని కూడా సర్కారు ప్రకటించింది.
టెస్టింగ్ బిల్లులో ఇలా..
ప్రతి నెలా ఇచ్చిన మాదిరే మీటర్ రీడర్, సిబ్బంది వినియోగదారుడు ఇంటికి వచ్చి రీడింగ్ నమోదు చేస్తారు. మొత్తం వాడిన యూనిట్లు, అందుకయ్యే ఛార్జీ, సేవా రుసుములు, విద్యుత్తు సుంకం వంటి వివరాలన్ని ఎప్పటిలాగే నమోదు చేస్తారు. 200 యూనిట్లలోపు అయితే గృహజ్యోతి సబ్సిడీ ఎంత అనేది ఉంటుంది. ఆ తర్వాత నికర బిల్లు దగ్గర సున్నా చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ