ఆటంకాలు తొలగేలా.. అర్జీలు పరిష్కారమయ్యేలా..
‘ధరణి’ చిక్కుముడుల వలలో చిక్కి విలవిలలాడిన దరఖాస్తు దారులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగే సమయం వచ్చేసింది.
ధరణి సమస్యల పరిశీలనకు ప్రత్యేక కార్యాచరణ
తాండూరు తహసీల్దారు కార్యాలయం
న్యూస్టుడే, తాండూరు: ‘ధరణి’ చిక్కుముడుల వలలో చిక్కి విలవిలలాడిన దరఖాస్తు దారులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగే సమయం వచ్చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలోని రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 9వరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కొనసాగనుంది. ఆటంకాలు తొలగించి అర్జీలు పరిష్కారమయ్యే విధంగా చూడాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
ఎన్నెన్నో సమస్యలు
జిల్లాలో 20 మండలాలు, 566 గ్రామ పంచాయతీలున్నాయి. ధరణిలో భూ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, ఇతరులు చేసుకున్న ద]రఖాస్తులు 14,228 ఉన్నాయి. వీటిలో పట్టా పాస్బుక్లకు సంబంధించి 232 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. పాస్బుక్లో ఒక పేరుంటే ధరణి పోర్టల్లో ఇంకో పేరు ఉండడం, వివాదాస్పద భూమికి పాస్బుక్ జారీ చేయడం, వాణిజ్య, వ్యాపార, లేఔట్లకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించే భూములకు నాలా ధ్రువీకరణ లేకుండా పాస్ బుక్ల జారీ, వారసత్వ భూ మార్పిడి, తప్పొప్పుల సవరణ వంటి సమస్యలెన్నో ఉన్నాయి.
నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా..
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ద]రఖాస్తులు వచ్చాయి. సాంకేతిక కారణాలకు తోడు ఇతరత్రా కారణాల వల్ల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దీంతో కొందరు రైతులు డబ్బు అవసరాల రీత్యా భూములను అమ్ముకోలేని పరిస్థితి నెల కొంది. నాలా ధ్రువీకరణ రాక పోవడంతో పొలాలను ఇళ్ల స్థలాలుగా విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. మరి కొందరు వ్యవసాయ భూముల్లో నాలా లేకుండా గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి రుణం పొందే పరిస్థితి లేకుండా పోయింది.
అత్యధిక ద]రఖాస్తులు వికారాబాద్లోనే..
ధరణిలో భూ సంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని 20 మండలాల్లో చేసుకున్న ధరఖాస్తుల్లో అత్యధికంగా వికారాబాద్లోనే 1,724 ఉన్నాయి. అత్యల్పంగా చౌడాపూర్లో 186 పెండింగులో ఉన్నాయి. పూడూరు 1,345, మోమిన్పేట 1,303, నవాబుపేట 1,179, మర్పల్లి 1.147, దోమ 1,010, పరిగి 935, దౌల్తాబాద్ 721, ధారూర్ 645, పెద్దేముల్ 579, కొడంగల్ 519, తాండూరు 504 కుల్కచర్ల 498, యాలాల 483, కోట్పల్లి 394, బొంరాస్పేట 350, బంట్వారం 260, దుద్యాల 234, బషీరాబాద్ 212 చొప్పున ద]రఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి సిబ్బంది బృందాలుగా గ్రామాలకు వెళతారని రెవెన్యూ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు