logo

మహిపాల్‌ ఔరా అనిపించాడు.. ఒకేసారి నాలుగు ఉద్యోగాలు!

విశ్వవిద్యాలయంలో ఓవైపు పరిశోధన కొనసాగిస్తూ, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఓకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు లక్ష్మీగళ్ల మహిపాల్‌.  

Updated : 03 Mar 2024 09:15 IST

మహిపాల్‌

లాలాపేట: విశ్వవిద్యాలయంలో ఓవైపు పరిశోధన కొనసాగిస్తూ, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఓకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు లక్ష్మీగళ్ల మహిపాల్‌.  

రాత్రి 12 గంటల వరకు పుస్తకాలతోనే: వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం, పులిమామిడికి చెందిన లక్ష్మీగళ్ల అంజయ్య, అనంతమ్మల మూడో కుమారుడు మహిపాల్‌ చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం సాగించాడు. డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తిచేసి 2015 నుంచి 2017 వరకు ఓయూలో చదివాడు. పీజీలో ఉండగానే యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)గా ఎంపికై ఆర్ట్స్‌ కళాశాలలో పీహెచ్‌డీ ప్రవేశం పొందాడు. పీజీకి, పీహెచ్‌డీకి మధ్యలో బీఈడీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా 2018లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది.అయినా చేరకుండా ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని తన సాధన సాగించాడు. యూనివర్సిటీ అందించే ఉపకార వేతనంతో బయట స్టడీహాల్‌లో ఉ. 9 నుంచి రాత్రి 12 వరకు కఠోర సాధన చేసేవాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగ ఫలితాల్లో టీజీటీ, పీటీజీ, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆర్ట్స్‌ కళాశాలలో ఆచార్య నిత్యానందరావు పర్యవేక్షణలో ‘వడ్డెపల్లి కృష్ణగేయాలు-సమగ్ర అధ్యయనం’ అన్న అంశంపై ఇటీవలే తన పరిశోధన గ్రంథాన్ని అందజేశారు. న్యూస్‌టుడేతో మాట్లాడుతూ...ఇన్నాళ్ల శ్రమఫలించిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని