logo

మూడో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

మూడో అంతస్తు నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో నివసించే గుమ్మడి రితేశ్‌రెడ్డి (28) వ్యాపారి. ఏడు నెలల క్రితం వివాహమైంది.

Updated : 03 Apr 2024 06:06 IST

ఆసుపత్రి భవనం పైనుంచి దూకుతూ..

నాగోలు, న్యూస్‌టుడే: మూడో అంతస్తు నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో నివసించే గుమ్మడి రితేశ్‌రెడ్డి (28) వ్యాపారి. ఏడు నెలల క్రితం వివాహమైంది. మంగళవారం ఉదయం ఉదయం 11.45 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు కారులో వేగంగా వచ్చాడు. ఎన్టీఆర్‌ నగర్‌ కమాన్‌ సమీపంలోని హనుమాన్‌ ఆలయం వద్ద కారు ఆపి శ్రీఆద్య ఆసుపత్రిలోకి వేగంగా వెళ్లాడు. భద్రతా సిబ్బంది వారించబోగా రోగి వద్దకని చెప్పాడు. మూడో అంతస్తులో ఖాళీగా ఉన్న ఓ గది కిటికీ నుంచి దూకాడు. నేలపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రి సిబ్బంది చికిత్స చేసినా ప్రాణాలు నిలవలేదు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై కారును వెంబడించాడని స్థానికులు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని