logo

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ పెద్దపీట

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఎంపీ, ఆ పార్టీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారని తెలిపారు.

Published : 03 Apr 2024 02:23 IST

మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి 

చేవెళ్ల: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట వేస్తుందని ఎంపీ, ఆ పార్టీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారని తెలిపారు. మంగళవారం చేవెళ్లలోని గార్డెన్‌లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. తాను భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ కార్యకర్తలు ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పోరాటం భాజపాతోనేనని, భారాసకు ఓటేస్తే మురిగిపోయినట్లేనన్నారు. కాంగ్రెస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలన్నారు.  సమావేశంలో భీంభరత్‌, సత్యనారాయణరెడ్డి, జ్యోత్స్న, వెంకటస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని