జలఘంటిక.. మేల్కోవాలిక
రాజధానిలో భూగర్భ జలాలు ఆవిరవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా.. గతంతో పోలిస్తే తాగునీటి సరఫరా సమయం, నీటి ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంపులోని నీరు సగం రోజుకే తరిగిపోతున్నాయి.
రోజు రోజుకు తీవ్రమవుతున్న నీటి కష్టాలు
ప్రభుత్వ కార్యాలయాలు, గృహ సముదాయాల్లో పొదుపు మంత్రం
ఈనాడు, హైదరాబాద్
రాజధానిలో భూగర్భ జలాలు ఆవిరవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా.. గతంతో పోలిస్తే తాగునీటి సరఫరా సమయం, నీటి ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంపులోని నీరు సగం రోజుకే తరిగిపోతున్నాయి. దాంతో.. వేలాది మంది రోజూ ట్యాంకర్ల కోసం జలమండలిని సంప్రదిస్తున్నారు. పలు ప్రభుత్వ ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలోనూ నీటి ఎద్దడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు నీటి ట్యాంకర్ల సాయంతో అవసరాలను తీర్చుకుంటున్నారు. అదే సమయంలో.. కొన్ని కాలనీ సంఘాలు పొదుపు మంత్రం పఠిస్తున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో సమస్య తీవ్రమవుతుందని, జలమండలి నీటి సరఫరాను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ.. భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తలెత్తిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
టీ కప్పులు కడిగేందుకూ.. కటకట
మాసబ్ట్యాంక్ సమీపంలోని ఓ ప్రభుత్వ భవన సముదాయంలో రోజు విడిచి రోజు నీటి సమస్య ఎదురవుతోంది. దాంతో.. టీ కప్పులను శుభ్రం చేసేందుకు కూడా నీరు ఉండట్లేదని సిబ్బంది వాపోతున్నారు. ఇదేంటని ఆరాతీస్తే.. జలమండలి ద్వారా వచ్చే నీరు త్వరగా అయిపోతోందని, బోరుబావి ఎండిపోవడం వల్ల ట్యాంకర్లను తెప్పించుకుంటున్నామని, ఆ నీరు కూడా సరిపోవట్లేదని అధికారులు తెలిపారు.
మార్చిలో ఏకంగా 1.69 లక్షల ట్రిప్పులు
మణికొండలోని ఫిల్లింగ్ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎండీ సుదర్శన్రెడ్డి
గ్రేటర్ వ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా కోసం జలమండలి ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. దీంతో ఒకేసారి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే 1.68 లక్షల ట్రిప్పులను జలమండలి సరఫరా చేసింది. గతేడాది మార్చి నెలతో పోల్చితే 56 వేల ట్రిప్పులు అదనంగా అందించారు. వానలు లేకపోతే మే నెలలో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 660 ఎంజీడీల వరకు నీటి డిమాండ్ ఉండగా.. జలమండలి 560 ఎంజీడీల వరకు సరఫరా చేస్తోంది. డిమాండ్కు సరఫరాకు మధ్య దాదాపు 100 ఎంజీడీలు తేడా ఉంది. రోజూ జలమండలికి ట్యాంకర్ల కోసం 4900 వరకు ఫోన్లు వస్తుండగా.. 6584 ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిత్యం 7 వేల ట్రిప్పులు పెండింగ్లో ఉంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసిన 2-3 రోజులకు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 24 గంటలపాటు సరఫరా చేయాలని జలమండలి ఇప్పటికే నిర్ణయించింది.
కేంద్రాల తనిఖీ..
ఫిల్లింగ్ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి మంగళవారం కొన్ని కేంద్రాలను తనిఖీ చేశారు. మణికొండ, నేతాజీపార్కు, షేక్పేట ఫిల్లింగ్ కేంద్రాలను తనిఖీలు చేసి అక్కడ లాగ్ బుక్లను పరిశీలించారు. ప్రస్తుతం 75 ఫిల్లింగ్ కేంద్రాల్లో 121 పాయింట్ల ద్వారా ట్యాంకర్లు అందిస్తున్నామని, త్వరలో మరిన్ని ఫిల్లింగ్ కేంద్రాలను, ట్యాంకర్లను పెంచనున్నట్లు ఎండీ చెప్పారు.
‘అలేఖ్య’ ఆదర్శం.. ఈతకొలను మూసేద్దాం
ఎండాకాలం వచ్చిందంటే గేటెడ్ కమ్యూనిటీల్లోని ఈతకొలనుల్లో పిల్లలు, పెద్దలు జలకాలాడుతుంటారు. చెప్పాలంటే ఈతకొలనులే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక ఆకర్షణ. నీటి ఎద్దడి కారణంగా ఈసారి స్వచ్ఛందంగానే పలుచోట్ల సొసైటీల్లోని ఈతకొలనులను మూసేస్తున్నారు. బెంగళూరులోని పరిస్థితి మన దగ్గర రాకూడదని ఎల్బీనగర్లోని అలేఖ్య టవర్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ ముందు జాగ్రత్తగా êఈసారి తమ కమ్యూనిటీలోని ఈత కొలనును తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించింది. సిటీలో పెరుగుతున్న నీటి కొరతను గమనించి ఈ నిర్ణయం తీసుకుందని గృహ యాజమాని ఒకరు తెలిపారు. తమ కమ్యూనిటీలో నీటికొరత లేదని.. అయితే బయట చాలా ప్రాంతాల్లో తాగడానికి, వాడుకోవడానికి నీటికి ఇబ్బంది పడుతుంటే.. తాము జలకాలాటలు ఆడటం సరికాదని భావించి సొసైటీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్