logo

మహిళ మెడలో బంగారం చోరీ

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారాన్ని తెంచేసి పరారైన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 03 Apr 2024 20:15 IST

కాప్రా: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారాన్ని తెంచేసి పరారైన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.  ఏసీపీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ నాగార్జునగర్‌లోని లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన ఆషపు పార్వతీశం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య ఆషపు రూప (29) ఇంటి వద్దే కుట్టు (టైలరింగ్) పనులు నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం షాపుకు నడుచుకుంటూ వెళుతుండగా వెనకనుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని