logo

హామీలు విస్మరించిన కాంగ్రెస్‌: కిషన్‌రెడ్డి

దేశంలో సుస్థిర పాలన కొనసాగేందుకు నరేంద్రమోదీని మరోసారి ప్రధానమంత్రిని  చేయాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 12 Apr 2024 02:55 IST

గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

గాంధీనగర్‌, విద్యానగర్‌, న్యూస్‌టుడే: దేశంలో సుస్థిర పాలన కొనసాగేందుకు నరేంద్రమోదీని మరోసారి ప్రధానమంత్రిని  చేయాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం  ఉదయం గాంధీనగర్‌లో, రాత్రి తిలక్‌నగర్‌ చౌరస్తా నుంచిబతుకమ్మకుంట, శారదానగర్‌, సీఈ కాలనీ, డీడీ కాలనీ, న్యూ వినాయక్‌నగర్‌ వరకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం పంపిణీని నేటికీ కొనసాగిస్తున్నారన్నారు. హామీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలను విస్మరించిందన్నారు. వందరోజులు గడిచినా రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2500 తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గౌతంరావు, కార్పొరేటర్‌ పావని, భాజపా నేతలు వినయ్‌కుమార్‌, రమేష్‌రామ్‌, రత్నసాయిచంద్‌, గోపాల్‌, వీఎస్టీ రాజు, ఉమేష్‌, ప్రకాష్‌యాదవ్‌, సత్తిరెడ్డి, ఎండీ మహమూద్‌, అరుణ్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని