నెలాఖరున మెట్రో-2 డీపీఆర్.. క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేపట్టిన ఏజెన్సీలు
మెట్రోరైలు రెండోదశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) నెలాఖరుకు కొలిక్కి రానుంది.
ఈనాడు, హైదరాబాద్: మెట్రోరైలు రెండోదశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) నెలాఖరుకు కొలిక్కి రానుంది. క్షేత్రస్థాయిలో భూపరీక్షలు, ట్రాఫిక్, ఇతర సర్వేలన్నీ దాదాపు పూర్తికావొచ్చాయి. వీటన్నింటిని క్రోడీకరించి డీపీఆర్ రూపొందించే పనిలో ఏజెన్సీలున్నాయి. ప్రాథమిక నివేదిక అందగానే మెట్రోరైలు ఇంజినీర్లు, అధికారులు పరిశీలించి.. ప్రభుత్వంతో చర్చించి అవసరమైన మార్పులు, చేర్పుల అనంతరం తుది నివేదిక సిద్ధం చేయనున్నారు. మెట్రోరైలును రెండోదశలో 70 కి.మీ. మేర విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కి.మీ., మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్, నూతన హైకోర్టు వరకు 4 కి.మీ., రాయదుర్గం నుంచి నానక్రాంగూడ కూడలి, విప్రో సర్కిల్, అమెరికన్ కాన్సులేట్ 8 కి.మీ., మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్, పటాన్చెరు వరకు 14 కి.మీ., ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ 8 కి.మీ, నాగోల్ నుంచి ఫలక్నుమా, చంద్రాయణగుట్ట వరకు 7 కి.మీ. మార్గాలను సర్కారు ప్రతిపాదించింది. ఇందులో నాగోల్-ఫలక్నుమా 5.5 కి.మీ. డీపీఆర్ ఇదివరకే ఉంది. ఈ మార్గంలో పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. మిగిలిన మార్గాలకు úడీపీఆర్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరు మార్గాల డీపీఆర్ బాధ్యతలను రెండు కన్సల్టెన్సీలకు హెచ్ఎంఆర్ అప్పగించింది. 2 నెలులుగా వీరు క్షేత్రస్తాయిలో సర్వేలు చేపట్టారు. విశ్లేషించి క్రోడీకరించడమే మిగిలిందని మెట్రోరైలు అధికారి ఒకరు అన్నారు. ఈ నెలాఖరుకు ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుందని చెప్పారు.
పూర్తి నివేదిక వచ్చాకే స్పష్టత..
70 కి.మీ. మార్గంలో కచ్చితంగా స్టేషన్ వచ్చే ప్రాంతం, ఎన్నిస్టేషన్లు రాబోతున్నాయనేది పూర్తి నివేదికతోనే స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. నిర్మాణ వ్యయం కూడా అప్పుడే తెలుస్తుందంటున్నారు.
సవాళ్లున్నాయ్..
- నాగోల్ నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే మార్గంలో సాగర్ రింగ్రోడ్డు వద్ద ఫ్లైఓవర్లను దాటడం మెట్రోకి సవాల్. ఆస్తుల సేకరణ చేయాల్సి వస్తుంది. ః ఈ మార్గంలో మైలార్దేవ్పల్లి నుంచి విమానాశ్రయం వెనక గోడ వరకు విశాలమైన సెంట్రల్ మీడియన్లో పెద్దఎత్తున వృక్షాలు ఉన్నాయి. అవి వందల సంఖ్యలోనే ఉన్నాయి. పనులు చేపడితే వీటిని తొలగించాల్సి వస్తుంది.
- మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో డబుల్డెక్ స్తంభాలు.. ప్లైఓవర్, మెట్రో కోసం అనుకున్నప్పటికీ.. ఆలస్యం కారణంగా జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే రహదారి విస్తరణ, ఫ్లైఓవర్లను చేపట్టింది. దీంతో ఇక్కడ డబుల్ డెక్ కాకుండా సాధారణ మెట్రోకే డీపీఆర్లో ప్రాధాన్యం ఇచ్చారు.
- ఎల్బీనగర్ - హయత్నగర్ మార్గంలో డబుల్ డెక్ వేయాలనే సూచనలు వచ్చాయి. సమన్వయ లోపం, డిజైన్లు సిద్ధంగా లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ ఎప్పటిమాదిరే ఫ్లైఓవర్లకు ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇక్కడ సైతం డీపీఆర్లో మెట్రోరైలు మార్గానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం