మరుగున పడినా ద్రువీకరిస్తాం
పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నట్లు, వాటిని మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ నుంచి శానిటరీ సర్టిఫికెట్ను తీసుకుని సమర్పించాలనే విద్యాశాఖ నిబంధనను కొందరు జీహెచ్ఎంసీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు.
శానిటరీ సర్టిఫికెట్ల పేరుతో కొందరు అధికారుల దందా
ఒక్కో పాఠశాల నుంచి రూ.10వేలు వసూలు!
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నట్లు, వాటిని మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ నుంచి శానిటరీ సర్టిఫికెట్ను తీసుకుని సమర్పించాలనే విద్యాశాఖ నిబంధనను కొందరు జీహెచ్ఎంసీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఆమ్యామ్యాలు సమర్పించిన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాల్ని ఇస్తున్నారు. విద్యాశాఖ అధికారులూ వాటిని గుడ్డిగా స్వీకరిస్తూ పాఠశాలల గుర్తింపును పొడిగిస్తున్నారు. ఇరుకు గదుల్లో నడుస్తున్న పాఠశాలల్లో సరైన మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో బాలికలు నరకం చూస్తున్నారు.
రూ.10వేల చొప్పున వసూళ్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలోని సహాయ వైద్యాధికారులు (ఏఎంఓహెచ్) పాఠశాలలకు పారిశుద్ధ్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. శానిటరీ సూపర్వైజర్లు(ఎస్ఎస్) తనిఖీ చేసి.. అంతా బాగుందని చెబితేనే సర్టిఫికెట్లు ఇస్తున్నామని ఏఎంఓహెచ్లు చెబుతున్నారు. కొందరు ఎస్ఎస్లు, వారి కింద పనిచేసే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడుకుని ఏఎంఓహెచ్లకు సర్టిఫికెట్ ఇవ్వాలనే సిఫార్సులు పంపుతారు.
ఉదాహరణకు.. ముషీరాబాద్, అంబర్పేట సర్కిళ్లలో పారిశుద్ధ్య ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను కింది స్థాయిలో ఒకే అధికారి నిర్వహిస్తున్నారు. ఆయన ఒక్కో పాఠశాల నుంచి రూ.10వేలు తీసుకుంటారని, పై అధికారులకు రూ.4వేలు ఇస్తుంటారని తోటి సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. రాంనగర్, కవాడిగూడ, బోలక్పూర్ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని పాఠశాలలకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల జారీని ఆన్లైన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారం రోజుల వ్యవధిలో తీసిన మరుగుదొడ్ల ఫొటోలను ఆన్లైన్లో పరిశీలించాకే ధ్రువీకరణపత్రం మంజూరయ్యేలా నిబంధన పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గుర్తింపుతో ముడిపడిన ఇతర పత్రాల్లోనూ.. అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారా, మెట్ల మార్గం.. నీటి ట్యాంకు సామర్థ్యం ఎంత తదితర విషయాల్లో పాఠశాల యాజమాన్యం తీసుకున్న చర్యలను పరిశీలించి జీహెచ్ఎంసీ లేదా అగ్నిమాపకశాఖ అధికారులు ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. భవన నిర్మాణ సామర్థ్యం, మైదానాలు తదితర అంశాలను పాఠశాలల గుర్తింపును పొడిగించే సమయంలో, పాఠశాల స్థాయిని పెంచే క్రమంలో విద్యాశాఖ పరిశీలిస్తుంది. ఈ క్రమంలో నకిలీ శానిటరీ సర్టిఫికెట్లు, ఫైర్ ఎన్వోసీలు తదితరాలు కొన్ని పాఠశాలలకు దన్నుగా నిలుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే