‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో నకిలీ కరెన్సీ..
నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవుపల్లి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.6.62 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరి అరెస్ట్.. రూ.6.62 లక్షల స్వాధీనం
నకిలీ నోటుపై చిల్ట్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రణ
కాటేదాన్, న్యూస్టుడే: నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవుపల్లి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.6.62 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ మధు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగరాజు స్టాక్బ్రోకరేజీ వ్యాపారం చేసి నష్టపోయాడు. నకిలీ కరెన్సీ చలామణితో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు రహస్యంగా నగదు పంపిణీ చేస్తుంటారని, ఇదే సరైన సమయమని తలచి తన ఆలోచన అమలు చేయాలనుకున్నాడు. మిత్రుడు అభినందన్తో కలిసి రెండునెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేష్ పవార్లు ఫేస్బుక్లో పోస్ట్చేసిన నకిలీ కరెన్సీ వీడియో చూసి వారిని వీడియోకాల్తో సంప్రదించారు. రూ.వెయ్యికి రూ.ఐదు వేల చొప్పున నకిలీ నోట్లు లభిస్తాయని నిర్ధారించుకున్నారు. మహరాష్ట్రలోని చద్వేల్ పట్టణానికి వెళ్లి రూ.3.5 లక్షల అసలు నగదు అందించి రూ.17 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడు తిరువూరులో ఉండే రవి అనే వ్యాపారికి వాటిని అందించి వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఒప్పందం కుదరలేదు. గురువారం నగరం చేరుకుని సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో బసచేశారు. శుక్రవారం ఉదయం మల్కాజిగిరిలోని సాయిరామ్ థియేటర్ వద్ద ఓ బైక్ అద్దెకు తీసుకుని నకిలీనోట్లతో మైలార్దేవుపల్లి మెహఫిల్ హోటల్కు చేరుకుని సరఫరాకు యత్నించారు. విశ్వసనీయ సమాచారంతో అప్పటికే చేరుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు మైలార్దేవుపల్లి పోలీసుల సహకారంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లపై ఆర్బీఐ స్థానంలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం