వేసవిలో చల్లదనం.. చుక్కల్లో వ్యయం
వేసవిలో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. కారణం.. ఏసీల వాడకం భారీగా పెరిగింది. ఇదివరకు ఇంటిలో ఒక ఏసీ వాడితే ఇప్పుడు 2, 3 వాడుతున్నారు.
మార్చిలో భారీగా వినియోగ ఫలితం
నగరంలో నెల విద్యుత్తు బిల్లు రూ.190 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: వేసవిలో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. కారణం.. ఏసీల వాడకం భారీగా పెరిగింది. ఇదివరకు ఇంటిలో ఒక ఏసీ వాడితే ఇప్పుడు 2, 3 వాడుతున్నారు. ఆదాయాల వృద్ధితో జీవన ప్రమాణాలు పెరగడంతో ఆ మేరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం పెరిగింది. అదే స్థాయిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. గ్రేటర్లో మూడు విద్యుత్తు జోన్లున్నాయి. ప్రధాన నగరం పరిధిలోకి మెట్రోజోన్ వస్తుంది. ఈ జోన్లో బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్ సర్కిళ్లున్నాయి. ఎల్టీకి సంబంధించి గృహ, వాణిజ్య కనెక్షన్లు కలిపి 21.60 లక్షలున్నాయి. మార్చిలో రూ.270 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఈ నెలలో చూస్తే ఏకంగా రూ.360 కోట్లకు పెరిగింది. ఏకంగా రూ.90 కోట్లు పెరిగింది. రంగారెడ్డి జోన్ పరిధిలో 4 సర్కిళ్లున్నాయి. ఇక్కడ బిల్లుల్లో పెరుగుదల రూ.70 కోట్లపైనే ఉంది. మేడ్చల్ జోన్లో 2 సర్కిళ్లున్నాయి. ఇక్కడ సైతం రూ.30 కోట్లపైనే పెరుగుదల నమోదైంది. మండే ఎండల వల్ల సిటీలో ఒక నెలలో అదనంగా రూ.190 కోట్ల వరకు వినియోగదారుల జేబుకు చిల్లుపడింది.
లోటు లేకుండా సరఫరా.. డిమాండ్ ఎంత పెరిగినా.. మార్చిలో కోతలు లేకుండా నిరంతర సరఫరాకు డిస్కం యత్నిస్తోంది. మార్చి 29న రికార్డు స్థాయిలో 81.39 మిలియన్ యూనిట్లు నమోదైతే మెట్రోజోన్, మేడ్చల్ జోన్లలో సున్నా బిల్లులు జారీ అయ్యాయి.
పొదుపు చర్యలతో.. అధికంగా బిల్లులు వస్తున్న గృహ వినియోగదారుల జీవనశైలిని గమనిస్తే వృథా కూడా ఎక్కువే ఉంటోందని ఎనర్జీ ఆడిట్ నిపుణులంటున్నారు.
- అవసరం లేకపోయినా అన్ని గదుల్లో లైట్లు వెలుగుతుంటాయి. అవసరం లేని వాటిని ఆపేయాలి.
- గదిలో ఎవరూ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఈ తరహా వృథా తగ్గించుకోవాలి. స్మార్ట్ స్విచ్ల ఏర్పాటుతో మొబైల్ నుంచే ఆపేయవచ్చు. సెన్సర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు