Hyderabad: తండ్రి చనిపోయిన ఐదో రోజే కొడుకు హత్య
కట్టుకున్న భర్త చనిపోయి ఐదు రోజులే అవుతోంది.. ఆయన బాధ తీరనే లేదు.. ఈలోపే కొడుకు మద్యం మత్తులో సైకోగా మారాడు.. రాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ పరువు తీస్తున్నాడు.. చీరతో కాళ్లు, చేతులు కట్టేసినా ఆగడం లేదు.
తల్లి, తమ్ముడే హంతకులు..
కోరె మురళి
ఉప్పల్, న్యూస్టుడే: కట్టుకున్న భర్త చనిపోయి ఐదు రోజులే అవుతోంది.. ఆయన బాధ తీరనే లేదు.. ఈలోపే కొడుకు మద్యం మత్తులో సైకోగా మారాడు.. రాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ పరువు తీస్తున్నాడు.. చీరతో కాళ్లు, చేతులు కట్టేసినా ఆగడం లేదు. దీంతో ఆ తల్లి చిన్న కొడుకు సహకారంతో అదే చీర గొంతుకు బిగించడంతో పెద్దకొడుకు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. రామంతాపూర్ కామాక్షిపురంలో ఉండే కోరె శోభకు కుమారులు మురళి అలియాస్ చింటు(23), మనోహర్(20) ఉన్నారు. మురళి డీజే ఆపరేటర్. చిన్న కొడుకు మనోహర్ డిగ్రీ చదువుతున్నాడు. భర్త కుమార్ బ్రెయిన్ ట్యూమర్తో ఈనెల 8న మృతి చెందాడు. శుక్రవారం అస్థికలు లంగర్హౌస్లోని సంఘమెట్లో కలిపి వచ్చారు. అదే రాత్రి స్నేహితులతో కలిసి మురళి ఇంటిపైన మద్యం తాగాడు. మత్తులో అర్థరాత్రి వీధుల్లో తిరుగుతూ హంగామా చేశాడు. వచ్చిపోయే వాహనాలను అపాడు. ఓ వాహనదారుడి మీద పడి భుజం కొరికేందుకు యత్నించాడు. ఆ సమయంలో తల్లి అతడి స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎంతకూ వినకుండా అరుస్తుండటంతో శోభ, తమ్ముడు మనోహర్ మురళిని చీరతో కాళ్లు, చేతులు కట్టేశారు. అయినప్పటికీ అరుస్తూనే ఉండటంతో అసహనంతో చీరను గొంతుకు గట్టిగా బిగించింది. దాంతో మురళి చనిపోయాడు. ఉదయం లేవడం లేదంటూ వీరిద్దరే అందరికీ చెప్పారు. మృతుడి పెద్దనాన్న కోరె శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కుటుంబ పోషకుడు..: తండ్రి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండటంతో మురళినే డీజే ఆపరేటర్గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ మద్యం తాగిన సమయంలోనే సైకోగా మారతాడు. గతంలోనూ బోనాల సమయంలో ఇదే తరహాలో వ్యవహరించాడు. అదే చివరికి ప్రాణాలను తీసేలా చేసింది.
మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురి దుర్మరణం
వీరయ్య
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఇద్దరు,. వనస్థలిపురంలో ఇద్దరు, పటాన్చెరులో ఒకరు విగతజీవులయ్యారు.
నాగోలు: చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్తున్న మామా అల్లుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై దయాకర్రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బండ్లబాయి బజార్కు చెందిన సాడె వీరయ్య (78) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడు జగదీశ్తో కలిసి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కోసం శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. హయత్నగర్లో ఉండే అల్లుడైన సుంకర మొగ్గయ్య (60) ఇంట్లో నిద్రించారు. శనివారం ఉదయం మొగ్గయ్యతో కలిసి వీరయ్య, జగదీశ్లు.. క్యాబ్ బుక్ చేసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. సరూర్నగర్ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొట్టింది. ముందు సీట్లోని మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వీరయ్య చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. జగదీశ్తో పాటు క్యాబ్ డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.డ్రైవరు నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మొగ్గయ్య
రెండు కార్లు ఢీ..
తుర్కయంజాల్ పురపాలిక: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా స్థంభంపల్లికి చెందిన బొల్లం ప్రణయ్కుమార్(29).. మీర్పేట్లోని నందిహిల్స్లో ఉంటున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన కుంచాల రవీందర్బాబు(29) వనస్థలిపురంలోని ఎస్కేడీనగర్లో ఉంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శుక్రవారం అర్ధరాత్రి కారులో ఇబ్రహీంపట్నం మీదుగా.. బీఎన్రెడ్డినగర్ వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న మరోకారు.. గుర్రంగూడ వద్ద డివైడరును దాటి ఇవతలి వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రణయ్కుమార్, రవీందర్బాబు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం
పటాన్చెరు అర్బన్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి డివైడర్పైకి ఎక్కి రోడ్డు దాటుతున్న కార్మికుడిని ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పటాన్చెరు పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు శనివారం నోవాపాన్ కూడలి సమీపంలో రోడ్డు దాటుతున్న కూలీ వనపర్తి జిల్లా రాజాపూర్కు చెందిన మహేష్ (20)ను ఢీకొంది. బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. అనంతరం ద్విచక్రవాహనాన్ని, కారు, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనతో ట్రాఫిక్ స్తంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి