logo

పంట ఎండుతోందని ఎమ్మెల్యేకు రైతు మొర

కందుకూరు మండలానికి వచ్చి తిరిగి వెళ్తున్న స్థానిక శాసన సభ్యురాలు సబితారెడ్డి కారును ఓ రైతు ఆపాడు.. పంట ఎండిపోతోంది.. కరెంటు లేక బోరు నీళ్లు రావట్లేదని కన్నీటిపర్యంతమయ్యాడు.

Published : 16 Apr 2024 05:51 IST

కందుకూరు, న్యూస్‌టుడే: కందుకూరు మండలానికి వచ్చి తిరిగి వెళ్తున్న స్థానిక శాసన సభ్యురాలు సబితారెడ్డి కారును ఓ రైతు ఆపాడు.. పంట ఎండిపోతోంది.. కరెంటు లేక బోరు నీళ్లు రావట్లేదని కన్నీటిపర్యంతమయ్యాడు. రైతు కళ్లలో కన్నీళ్లు చూసిన సబితారెడ్డి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. విద్యుత్తు ఇబ్బందులతో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేసిన ఘనత భారాస ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని