నీటి వృథా నివారణకు ముమ్మర తనిఖీలు
‘పడిపోతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని పరిగి పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం, నీటి వృథాను అరికట్టడంలో భాగంగా తనిఖీలు విస్తృతం చేశామని’ పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు.
న్యూస్టుడే, పరిగి: ‘పడిపోతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని పరిగి పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం, నీటి వృథాను అరికట్టడంలో భాగంగా తనిఖీలు విస్తృతం చేశామని’ పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. ఎండలు ముదురుతున్న వేళ పరిగి పట్టణంలో ప్రజలు తాగునీటికి పడుతున్న అవస్థలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై ‘న్యూస్టుడే’ ఆయనతో ‘ముఖాముఖి’ నిర్వహించగా పలు విషయాలను తెలిపారు. ఆ వివరాలు..
న్యూస్టుడే: పట్టణంలో ఎద్దడి సమస్య తీవ్రమవుతోంది. ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు?
కమిషనర్: ఎద్దడి నివారణకు రూ.14.5లక్షలను వెచ్చిస్తున్నాం. సుమారు 20లక్షల లీటర్ల భగీరథ నీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలో 66బోర్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. అవసరమైన చోట్ల పాత వాటిని మరమ్మతు చేస్తాం. పరిస్థితులు మరీ ఇబ్బందిగా మారితే కొత్తవి వేయిస్తాం. ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టి వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
న్యూ: కొత్త కాలనీల సంగతేమిటి?
కమిషనర్: పరిగి మున్సిపాలిటీలో కొన్ని కాలనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలకు నీటి సమస్య రాకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం.
న్యూ: పలుచోట్ల ఇంకా నీటి వృథా జరుగుతోంది కదా?
కమిషనర్: వివిధ చోట్ల కుళాయిల ద్వారా నీటి వృథాకు పాల్పడుతున్న 20 మందికి నోటీసులు జారీ చేశాం. లీకేజీలను గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తున్నాం.
న్యూ: పారిశుద్ధ్యం మెరుగుదలకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
కమిషనర్: పట్టణంలో చెత్తదిబ్బ లేకపోవడంఅవరోధంగా మారింది.ప్రభుత్వం ఇందుకోసం 4 ఎకరాలను కేటాయించింది. స్థానికంగా ఉన్న సమస్య కొలిక్కి రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
న్యూ: వర్షాకాలంలో ఇళ్లలోకి వరదనీరు రాకుండా ఏం చేయబోతున్నారు?
కమిషనర్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. ఈ క్రమంలోనే మురుగు కాల్వల్లోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నాం. కాల్వల్లో సాఫీగా నీరు పారితే సగం సమస్య తీరుతుంది.
న్యూ: వీధులు శుభ్రం చేసే యంత్రాలు వృథాగా పడి ఉన్నాయి. వాటిని ఎందుకు వినియోగించరు?
కమిషనర్: నైపుణ్యం కలిగిన డ్రైవర్ లేకపోవడంతోనే సమస్య వచ్చింది. వాహనాలకు చిన్నచిన్న మరమ్మతు పనులు అవసరం ఉన్నాయి. అవి పూర్తిచేసి ప్రత్యేక శిక్షణ ఇప్పించి వినియోగంలోకి తీసుకువస్తాం.
న్యూ: పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటిపై దృష్టి సారిస్తారా?
కమిషనర్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు స్వయంగా వారే రాసి ఇస్తున్నారు. దీంతో ఆన్లైన్లో అనుమతులు లభిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు వారే బాధ్యులవుతారు. మావంతుగా పర్యవేక్షణ పెంచి అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలింపించాల్సిందే.. గులాబీ వికసించాల్సిందే
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రతిపక్ష భారాస ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల కంటే అధికంగా వచ్చేలా చూడాలంటూ భారాస అధినేత కేసీఆర్ ఆయా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. -
4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు. -
ఉద్దండుల బరి హైదరాబాద్
[ 30-04-2024]
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్ పీడీఎఫ్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
ఆకాశంలో సగం.. వినిపించని గళం
[ 30-04-2024]
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరం నుంచి పార్లమెంటు వేదికగా గళం వినిపించేందుకు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. -
ఆ 60వేల ఓట్లు ఎవరివి
[ 30-04-2024]
గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పాతబస్తీలో ఆచూకీ లేని 60వేల మంది ఓటర్లను జీహెచ్ఎంసీ గుర్తించింది. మరిన్ని గుర్తింపు కార్డులను పరిశీలించాల్సి ఉండగా ఎన్నికల తేదీ దగ్గరపడటంతో అధికారులు పరిశీలన కార్యక్రమాన్ని ఆపేసినట్లు సమాచారం. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం: డా.శివకుమార్
[ 30-04-2024]
ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా మెరుగైన ప్రావిడెంట్ ఫండ్ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డా.శివకుమార్ పేర్కొన్నారు. -
ఓయూలో నీటి సెగలు.. విద్యుత్తు వెతలు
[ 30-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత సెగలు.. విద్యుత్తు కోతల వెతలతో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
ఈత కొలనులో అవినీతి మేత
[ 30-04-2024]
ప్రజాధనాన్ని ప్రణాళికాబద్ధంగా దోచేయడంలో జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు సిద్ధహస్తులు. ఒకే ప్రణాళికను కొన్నేళ్లుగా అమలు చేస్తూ.. ఏటా రూ.3 కోట్లకు పైగా నిధులను దోచేస్తున్నారు. -
కొత్త పంథాలో రాజకీయ దావత్లు!
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. -
మల్కాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి చేసిందేమీ లేదు
[ 30-04-2024]
రేవంత్రెడ్డిని ఎంపీగా చేసింది, టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది, చివరికి ముఖ్యమంత్రిని చేసింది సైతం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలే అనీ.. అలాంటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. -
ఇక సమరమే..!
[ 30-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు బరిలో దిగే అభ్యర్థుల లెక్క తేలింది. సోమవారం ఉపసంహరణల అంకం ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తించేందుకు వారంతా వ్యూహాలకు పదునెక్కించే పనిలో పడ్డారు. -
మోదీకి దివ్యాంగులు అండగా నిలవాలి
[ 30-04-2024]
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. -
దేశం భాజపానే కోరుకుంటోంది: విశ్వేశ్వర్రెడ్డి
[ 30-04-2024]
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు. -
ఓటరు సౌలభ్యతే లక్ష్యం
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది. -
ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల ఖాతాలో వేస్తాం
[ 30-04-2024]
ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. -
పతుల విజయానికి సతుల పిలుపు
[ 30-04-2024]
కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్ఆర్ అన్నారు. -
అమ్మను పిలిచి.. మృత్యుంజయుడై..
[ 30-04-2024]
అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్ కుమార్(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది. -
కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి
[ 30-04-2024]
ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. -
విద్యుత్తుకు రికార్డు డిమాండ్
[ 30-04-2024]
గ్రేటర్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్ 4133 మెగావాట్లకు చేరింది. -
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన
[ 30-04-2024]
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
ప్లాట్ల అభివృద్ధి పేరుతో మోసం
[ 30-04-2024]
ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
గుజరాతీ.. సందడి మస్తీ
[ 30-04-2024]
అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్ ఘనంగా ముగిసింది. శంషాబాద్ మున్సిపల్ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. -
రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలుస్తాం: భాజపా
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్, గీతామూర్తి పేర్కొన్నారు. -
మోదీ హయాంలో ముస్లింలను అనుమానిస్తున్నారు
[ 30-04-2024]
దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!