ఆపరేషన్ మల్కాజిగిరి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
భాజపా, భారాస నాయకులపై కాంగ్రెస్ గురి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపీగా వ్యవహరించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం కావడం.. 37.28 లక్షల ఓటర్లున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డిని లక్షకుపైగా మెజారిటీ గెలిపించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా భాజపా, భారాసల్లో అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకొని ఓటింగ్ శాతం పెంచుకోవాలని కార్యాచరణ రూపొందించారు. పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారాస, భాజపా నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పట్టణ ఓటర్లు, నాయకులే లక్ష్యం
పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జవహర్నగర్ కార్పొరేషన్ను హస్తగతం చేసుకోగా... ఘట్కేసర్, మేడ్చల్ పురపాలికల్లో నాయకులను చేర్చుకున్నారు. ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ పావనీ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. తాజాగా పిర్జాదీగూడ కార్పొరేషన్కు చెందిన పదిమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలోనూ విజయం లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జంపన ప్రతాప్ను పార్టీలో చేర్చుకున్నారు.
ఆ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి..
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 37.28లక్షల మంది ఓటర్లుండగా, 19.50లక్షల మంది కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల వారే. ఈ మూడుచోట్ల భారాస ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని మెజారిటీ ఓట్లు సాధించాలని భావిస్తున్నారు. కుత్బుల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరడంతో భాజపాకు నష్టం జరిగిందని అనుకుంటున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ భారాస నేత రామ్మోహన్గౌడ్ను పార్టీలోకి ఆహ్వానించడంతో భారాస ఓటుబ్యాంక్కు గండిపడినట్టేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరింతమంది భాజపా, భారాస నేతలను చేర్చుకుని భారీ మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక