logo

లష్కర్‌లో బోణీ కొడతాం: కేటీఆర్‌

తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్‌ (లష్కర్‌) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Updated : 19 Apr 2024 04:38 IST

మాట్లాడుతున్న కేటీఆర్‌, పక్కన ఎమ్మెల్యే గోపీనాథ్‌

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్‌ (లష్కర్‌) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ భారాస బూత్‌స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం రాత్రి యూసుఫ్‌గూడలోని మహమూద్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్‌ మాట్లాడుతూ...తమ భోణీ లష్కర్‌తోనే మొదలవుతుందని, ప్రస్తుతం పోటీ భారాస, భాజపా మధ్యనే ఉందన్నారు. భారాస లోక్‌సభ అభ్యర్థి పద్మారావు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు సోహైల్‌, కార్పొరేటర్లు రాజ్‌కుమార్‌ పటేల్‌, ఎం. కవితారెడ్డి, దేదీప్యరావు, ఎస్‌.హేమ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని