పర్యవేక్షణ శూన్యం.. ట్యాంకులు అధ్వానం
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకోసం పంచాయతీ మొదలు మున్సిపాలిటీల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.
తాండూరులో మరమ్మతులకు ఎదురుచూస్తున్న ట్యాంకులు
న్యూస్టుడే, పరిగి, తాండూరు: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకోసం పంచాయతీ మొదలు మున్సిపాలిటీల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ ఈ పరిస్థితి జిల్లాలో కానరావడంలేదు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఉచితంగా సరఫరా చేసున్న తాగునీరు గొంత తడపలేకపోతోంది. ప్రజలు తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
గాడి తప్పుతున్న భగీరథ లక్ష్యం
జిల్లాలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు.
- పరిగి, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల పరిధిలోని 974 గ్రామాలకు పరిగి మండలం రాఘవాపూర్ సమీపంలోని నీటిశుద్ధి కేంద్రం నుంచి భగీరథ నీటి సరఫరా జరుగుతోంది. కనీసం ప్రతి పదిహేను రోజులకోసారి ట్యాంకులను శుభ్రం చేయాలి. పంచాయతీల్లో సిబ్బంది కొరత, కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది.
- సమయానుకూలంగా శుభం చేయకపోవడం, క్లోరినేషన్ పూర్తిగా మరిచిపోవడంతో తాగేనీటిలో చెత్తా చెదారంతో పాటు నాచు వస్తోందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి కావడంతో ట్యాంకుల శుభ్రత తప్పసరి అని స్వయంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులే చెబుతున్నారు. అయినా కార్యదర్శులు తగినంత దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
- ప్రభుత్వం భగీరథ నీటి విషయంలో సందేహాలు వద్దని చెబుతోంది. కానీ శుభ్రత విషయంలో ఆందోళనతో చాలా మంది ఆ నీటిని తాగడానికి ముందుకు రావడంలేదు. ఇళ్ల శుభ్రతకు, దుస్తులు ఉతకడానికి తదితర అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు.
శుభ్రం చేసే తేదీలను రాయాల్సిన బోర్డు
కొన్నిచోట్ల నెలకు.. మరికొన్ని చోట్ల రెండు నెలలకోసారి
- తాండూరులో తాగునీటి సరఫరా ట్యాంకుల పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల నెలకు, మరికొన్నినెలకో..రెండు నెలలకోసారి శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో శుభ్రత లోపించిన నీటిని తాగితే వ్యాధుల బారిన పడే వీలుంది. ట్యాంకులను ఎప్పుడు శుభ్రం చేసింది? తిరిగి మళ్లీ ఎపుడు శుభ్రం చేయాలనే విషయంలో ప్రత్యేకంగా నామఫలకంపై రాయాలి. కానీ దీన్ని ఎవరూ పట్టించు కోవడం లేదు.
- తాండూరు పట్టణంలో 71వేల మంది జనాభాకు తాగునీటిని సరఫరా చేసే 8 ట్యాంకులు ఉన్నాయి. వీటి నుంచి 9 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నా అనేకచోట్ల శుభ్రత కానరావడంలేదు.
- వికారాబాద్ మున్సిపల్ డివిజన్లో ట్యాంకుల శుభ్రత మరిచిపోయారు. ట్యాం కులు పాతవి కావడం, పర్యవేక్షణ లోపం ఫలితంగా పలుచోట్ల మట్టి, వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఎండలను, తాగునీటి అవస్థలను దృష్టిలో పెట్టుకునైనా ట్యాంకుల శుభ్రత చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మిషన్ భగీరథ పథకం ప్రారంభం...2018
వెచ్చించిన మొత్తం.. రూ.402 కోట్లు
ట్యాంకుల నిర్మాణం.. 402
పైప్లైన్ల ఏర్పాటు..1920 కి.మీ.
కుళాయి కనెక్షన్లు.. 1.98 లక్షలు
ప్రస్తుతం ట్యాంకుల శుభ్రత.. 40 శాతం లోపే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.