గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాంనగర్, న్యూస్టుడే: ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను సోమవారం ఠాణా ఆవరణలో ఏసీపీ రమేష్కుమార్ వెల్లడించారు. గాంధీ ఆసుపత్రి ఎదుట కాలిబాటపై నివసిస్తున్న రాజశేఖర్(20) జల్సాలకు అలవాటు పడి.. ద్విచక్ర వాహనాలను దొంగిలించి విక్రయించేవాడు. అతడిపై నగరంలోని అఫ్జల్గంజ్, వరంగల్ మట్టెవాడ ఠాణాల్లోనూ గతంలో కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 9న అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన రాజశేఖర్.. గుడి తాళం పగులగొట్టి ఆరు పంచలోహ విగ్రహాలు, 8.5 తులాల స్వర్ణాభరణాలను దోచుకెళ్లాడు. సీసీఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, ఆయా విగ్రహాలు కొనుగోలు చేసినట్లు గుర్తించి భోలక్పూర్కు చెందిన మహ్మద్ ఆసిఫ్(28), ఇస్మాయిల్ హుస్సేన్(23)లను అదేనెల 23న అరెస్ట్చేశారు. విగ్రహాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. రాజశేఖర్ కోసం అప్పటినుంచి గాలిస్తున్నారు. సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్డులో వాహనాల తనిఖీ వేళ.. అనుమానాస్పదంగా కన్పించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. గుడిలో దొంగింలించిన బంగారు ఆభరణాలను భోలక్పూర్కు చెందిన మొహినుద్దీన్(23), ఖలీద్ అహ్మద్(31)లకు విక్రయించినట్లు చెప్పాడు. వారిని సైతం అదుపులోకి తీసుకొని ఆభరణాలు, 3 బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
మోసపోయిన మహిళ ఆత్మహత్య
తోయాజాక్సి
పటాన్చెరు అర్బన్, న్యూస్టుడే: పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పటాన్చెరు పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మకరజోలకు చెందిన తోయాజాక్సి(25) పటాన్చెరు మండలం పాశమైలారంలో ఓ పరిశ్రమలో హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఇస్నాపూర్లో ప్రైవేటు వసతిగృహంలో ఉంటుంది. 2021లో ఇదే జిల్లాకు చెందిన విజయ్తో వివాహమైంది. అదే జిల్లా సువర్ణపురానికి చెందిన కిరణ్కుమార్ ‘నిన్ను ప్రేమించాను.. నీ భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటాను’ అని రోజు ఫోన్ చేస్తూ, మెసేజ్లు పెట్టేవాడు. ఇది నమ్మిన తోయాజాక్సి తన భర్త విజయ్కు 2023 డిసెంబర్లో విడాకులిచ్చింది. తరువాత పెళ్లి చేసుకోమని కిరణ్కుమార్ను అడగ్గా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవటం లేదు.. తనకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని మాట మార్చాడు. దీంతో ఈనెల 20న గుర్తుతెలియని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె సహోద్యోగి ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కిరణ్కుమార్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళలను వేధిస్తున్న నలుగురికి జైలు
ఈనాడు, హైదరాబాద్: మహిళలను వేధిస్తున్న నలుగురిని షీటీమ్స్ బృందాలు పట్టుకున్నట్లు నగర మహిళా భద్రత విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రెండు రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ ఆదేశాలిచ్చినట్లు వివరించింది. మహిళల భద్రత, చిన్నారులపై లైంగిక వేధింపులు, సైబర్ నేరాల నియంత్రణపై నగరంలోని బస్తీలు, వివిధ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు వివరించింది.
సంపులో పడి యువకుడి మృతి ఘటనలో యజమానిపై కేసు
రాయదుర్గం, న్యూస్టుడే: నీటి సంపులో పడి ప్రైవేటు ఉద్యోగి మృతిచెందిన ఘటనలో పీజీ (పెయింగ్ గెస్ట్) హాస్టల్ యజమానిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ వెంకన్న వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్ సుఫియాన్(26) గచ్చిబౌలి అంజయ్యనగర్లోని షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 10.30కు జిమ్కు వెళ్లి వచ్చి భవనం పార్కింగ్లో ఉన్న మూత తెరిచి ఉన్న సంపులో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన గేటు నుంచి మూడు అడుగులు నడిచి ముందుకొచ్చే క్రమంలో 12 సెకన్లలోనే సంపులో పడినట్లు సీసీ కెమెరాల్లోని ఫుటేజీలో కనిపించింది.
జల్సాలతో నేరాల బాట.. ముగ్గురు యువకుల అరెస్టు
స్వాధీనం చేసుకున్న వస్తువులు
నల్లకుంట, న్యూస్టుడే: జల్సాల కోసం ప్రజలను భయపెట్టి చోరీలు చేస్తున్న ముగ్గురు పాత నేరస్థులు బోరబండకు చెందిన కల్మేరా రమేష్(19), ఎర్రగడ్డకు చెందిన పెండాల వెంకటస్వామి(21), కమ్మగోని కార్తిక్గౌడ్(19)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం నల్లకుంట పోలీస్స్టేషన్లో ఓయూ ఏసీపీ జగన్ వెల్లడించారు. వీరు పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. ద్విచక్రవాహనాల చోరీతోపాటు ఒంటరిగా బస్టాపుల్లº, ఆటోల్లో నిద్రించేవారిని కత్తులతో బెదిరించి నగదు, నగలు లాక్కెళ్లేవారు. ఈనెల 21న ఎస్సై కృష్ణ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 4 చరవాణులు, కత్తి, బ్లేడు, త్రిశూలం స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. నల్లకుంట సీఐ జగదీశ్వర్రావు, లాలాగూడ సీఐ రమేష్గౌడ్, ఎస్సైలు కృష్ణ, నాగరాజు, శ్రీనివాస్, రమాదేవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!