logo

ఐపీఎల్‌ మ్యాచ్‌.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు

ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్‌ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

Published : 24 Apr 2024 01:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్‌ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఉప్పల్‌, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 12.15 గంటలకు బయలు దేరుతాయని తెలిపారు. మ్యాచ్‌ తిలకించేందుకు వచ్చే అభిమానులు ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు, అర్ధరాత్రి పూట ఇబ్బంది పడకుండా మెట్రోరైలు సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ప్రత్యేక బస్సులు: మ్యాచ్‌కు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి మొత్తం 60 బస్సులను నడుపుతున్నట్టు గ్రేటర్‌జోన్‌ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని