వర్షపు నీటిని ఒడిసి పడదాం..
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
‘జల యోధులను తయారు చేద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం
రీఛార్జింగ్ పిట్ల ఏర్పాటుపై ప్లంబర్లకు అవగాహన కల్పిస్తున్న ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకునే దుస్థితిని నుంచి బయటపడేందుకు ‘జలయోధులను తయారు చేద్దాం’ అంటూ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలిరోజు 350 మందికి పైగా హాజరయ్యారు. 1000 మందికి శిక్షణ ఇప్పించి వారి ద్వారా మరికొంత మందికి శిక్షణ ఇచ్చి కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉద్యమంలా రీఛార్జింగ్ పిట్లు ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. జలమండలి, జీహెచ్ఎంసీ, ఈపీటీఆర్ఐలో ప్లంబర్లకు మూడు గంటల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈనెల 24, 25 తేదీల్లోనూ ఈ శిక్షణ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ, జలమండలి వెబ్సైట్లో ఉన్న ‘గూగుల్ఫారం’ నింపి శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
నాడు ఇంకింది.. నేడు ఉబుకుతోంది.. ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టినా కొన్నిచోట్ల విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే బోర్వెల్, సంపులచుట్టూ రీఛార్జింగ్ పిట్లు ఏర్పాటుచేసి అవసరమైతే ఇంజెక్షన్ బోర్వెల్, డగ్వెల్, ఇంకుడు గుంతలు, డ్రమ్ రీఛార్జ్, మాడ్యులర్ రెయిన్వాటర్ హార్వెస్ట్ ఏర్పాటుచేస్తే లక్షలాది లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చని ‘బ్లూ హైదరాబాద్’ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో ముషీరాబాద్ పద్మశాలికాలనీలో, జీహెచ్ఎంసీ కార్యాలయం, పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఇలా చేపట్టిన ప్రయోగాలు సఫలమై పుష్కలంగా నీరు లభిస్తోందని తెలిపారు. వాననీటి సంరక్షణతో పద్మశాలి కాలనీలో 26 ఏళ్లుగా నీటి ఎద్దడి రాలేదని, 31 అడుగుల్లోనే నీరు ఉబుకుతోందని కాలనీవాసులు చెబుతున్నారు.
80శాతం అందులోనే.. నగరానికి కావాల్సిన నీటి మొత్తంలో 80 శాతం మిద్దెలు, డాబాలు, పైకప్పు భాగాలపై పడిన వర్షపు నీటి ద్వారా దొరుకుతుంది. కానీ ఆ మేరకు వర్షపు నీటిని సంరక్షించి వాడుకోలేకపోతున్నాం. ఒక్కో అపార్టుమెంట్ పైకప్పు భాగాన సుమారు 16.5 లక్షల లీటర్ల వర్షపు నీరు కురుస్తుంది. ఈ మొత్తం నీటిని వినియోగించుకుంటే ట్యాంకర్ల ఖర్చు రూ.2.5 లక్షలు తగ్గించుకోవచ్చు.
ఎలా సేకరించాలి.. ప్లంబర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా సులువుగా, వేగవంతంగా నగరంలో రీఛార్జింగ్ పిట్లు నిర్మించుకోవచ్చు. కొత్త భవన నిర్మాణాలు, మిద్దెలు, డాబాలు, పైకప్పులు, ఖాళీ స్థలాలు, ఉద్యానవనాలు, మైదానాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీటిని ఇంకేలా చేయడంతో పాటు వరదలను నివారించొచ్చు. ్య మిద్దెలు, డాబాలు, పైకప్పులపై పడే వర్షపు నీటిని భూఉపరితల లేదా అంతర్భాగ ట్యాంకుల్లో నింపుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ్య భూములపై లేదా ఖాళీ స్థలాలపై పడే వర్షపు నీటిని చెరువులు, సరస్సులకు మళ్లించడం ద్వారా భారీ నీటి వనరుల్లాగా తయారవుతాయి.
ఇంకుడు గుంతలకు మొబైల్ యాప్
ఈపీటీఆర్ఐ సూచన మేరకు వాన నీటి సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ‘ఓడీకే కనెక్ట్’ పేరుతో మొబైల్యాప్ను రూపొందించామని వాన నీటి సంరక్షణ ప్రాజెక్టు సీఈవో కల్పనా రమేశ్ తెలిపారు. పౌరులు, మేస్త్రీలు, ప్లంబర్లు ఆ యాప్లో లాగిన్అయి, వారు నిర్మించిన ఇంకుడుగుంతల వివరాలను అప్లోడ్ చేస్తే.. ఉత్తమ నిర్మాణాలకు బహుమతులు అందిస్తామన్నారు. వారికి సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలను కూడా అందజేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.