సమృద్ధి జలం.. సంరక్షణతోనే ఫలం
భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది. అయిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. రాజరాజేశ్వర 27.5, అన్నపూర్ణ 3.5, ఎగువమానేరు జలాశయాలు 2 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. వీటితోపాటు 625 చెరువులున్నాయి. మల్కపేట, అదనపు ఎత్తిపోతల పథకం పూర్తయితే నీటి వనరుల సామర్థ్యం మరింత పెరుగుతుంది. జిల్లాలో వ్యవసాయానికి 47,568 బావులు, బోరుబావులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కారణం సాగునీటి వనరుల కింద కాల్వల వ్యవస్థ సక్రమంగా లేదు. పంటల సాగులో వరి గణనీయంగా పెరిగింది. నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ గతంతో పోల్చితే భూగర్భజలాల వినియోగం భారీగా పెరిగిందని భూగర్భజలశాఖ ఏడీ గంగ నర్సింలు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి వాటి వాడకం ఎలా ఉండాలనే దానిపై ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.
ఆందోళనకర పరిణామాలు లేవు
మూడేళ్ల క్రితం అధిక వర్షపాతంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న ఏడాదే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మార్పు వచ్చింది. జిల్లా సాధారణ వర్షపాతం 915.3 మిల్లీమీటర్లకు 2020-2021లో 46 శాతం, 2021-2022లో 71 శాతం, 2022-2023 (జనవరి)లో 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2016-17లో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 95 వేల ఎకరాలు కాగా అందులో వరి 44,709 ఎకరాలు. 2022 వానాకాలంలో సాగు 2,40,429 ఎకరాలు కాగా అందులో వరి 1,77,370 ఎకరాలు. ప్రస్తుత యాసంగిలో 1,68,763 ఎకరాలకు గాను 1,66,873 ఎకరాల్లో వరి వేసేవారు. మొత్తం సాగులో 98 శాతం వరి ఉంది. నీటి లభ్యత పెరుగుతున్న కొద్దీ సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. కారణం మూడేళ్లలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం అన్ని కాలాల్లో 12 మీటర్ల లోపే ఉంటోంది. వీటిలో 70 శాతం లోపు వినియోగిస్తేనే సురక్షితంగా పరిగణిస్తాం. ఆ స్థాయి దాటితే తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఆందోళనకర పరిణామాలు లేవు. అయితే భవిష్యత్తు భూగర్భ జలాలు కలుషితం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉంది.
నిరంతర వినియోగం తగ్గించాలి
నవంబరులో జిల్లా సగటున 3.67 మీటర్లు ఉంటే జనవరి నెలాఖరులోగా 6.43 మీటర్లకు చేరాయి. అంటే నెలకు సగటున మీటరు లోతుకు పడిపోతున్నాయి. యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. వచ్చే మూణ్నెళ్లు అవసరం మేరకే వాడుకునే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ప్రస్తుతం భూగర్భ జలాల లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీన్ని వినియోగిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. బోరుబావుల నిరంతర వినియోగం తగ్గించాలి. ఉపరితల కాల్వల ద్వారా నీటిని వినియోగిస్తే మంచిది. అది పంట దిగుబడులకు మేలు చేస్తుంది. అంతే కాకుండా అత్యంత లోతు నుంచి భూగర్భ జలాన్ని తోడేయడం వల్ల భూమి అంతర పొరల్లో అనేక మార్పులు సంభవించి భూమి కుంగిపోవడం, కంపించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. వర్షపు నీరు పూర్తిగా భూమిలోకి ఇంకేలాగా వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేలా రీఛార్జి గుంతలు తవ్వాలి.
ఏటా పెరుగుదల..
జిల్లాలో 2016 మేలో 17.95 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండేవి. 2020 మేలో 11.07 మీటర్లకు చేరాయి. మూడేళ్లుగా జనవరిలో సగటున 5.96 మీటర్లలోనే ఉంటున్నాయి. 2021లో 6.30 మీటర్లు, 2022లో 5.16, 2023లో 6.43 మీటర్లగా ఉంది. ఒకప్పుడు కరవు పీడిత ప్రాంతమైన జిల్లాలో ఈ పరిణామం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. జలాశయాల నిర్మాణం, మానేరు, మూలవాగులపై చెక్డ్యాంలతోపాటు ఊట కుంటలు, వివిధ రకాల ఇంకుడు గుంతలను నిర్మించడం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం ఏటా గణనీయ పెరుగుదల నమోదవుతూనే ఉంటుంది.
జాతీయస్థాయిలో గుర్తింపు
జిల్లాలో ఒకే సంవత్సరం 6.03 మీటర్ల భూగర్భ జలాలు పైకి రావడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీనికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలు పూడికతీత, భూగర్భజలాలు ఇంకేలా కొండల ప్రాంతంలో రీఛార్జి కందకాలు తవ్వకం చేపట్టాలి. వీటన్నింటిని పూర్తిస్థాయిలో వినియోగించడంతోనే సాధ్యమైంది. ఇది భవిష్యత్తు ఐఏఎస్లకు ప్రేరణ కలిగించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జల విధానాన్ని ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ శిక్షణలో ఒక పాఠ్యాంశంగా చేర్చడం వల్ల జిల్లా జల విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల