సహకార సంఘాలు.. వ్యాపార వృద్ధి మార్గాలు
ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.
విజయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి
చిగురుమామిడి వ్యవసాయ సహకార సంఘం
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. దీంతో రాష్ట్రంలో విజయ సంస్థకు సంబంధించి నూనెలు, బియ్యం, గోధుమ పిండి వంటి ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని సహకార సంఘాలు, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల అమ్మకాలు, రైస్మిల్లుల నిర్వహణ, సూపర్మార్కెట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఉన్నారు. ఇవేకాకుండా సుమారు 36కు పైగా సహకార సంఘాల పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. వీటిని పెట్రోలియం సంస్థల ఔట్లెట్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
ఏప్రిల్లో సెంటర్లు
ప్రతీ సంఘ పరిధిలో ఒక కామన్ సర్వీసు సెంటర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 128 సహకార సంఘాలను కంప్యూటీకరణ జరిగింది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కామన్ సర్వీసు సెంటర్లు ఏర్పాటు సులభతరం కానుంది. కంప్యూటర్, ప్రింటర్, బయోమెట్రిక్ పరికరం, ఇంటర్నెట్ కనెక్షన్ వంటివి అవసరం. ఇవన్నీ ఆయా సహకార సంఘాలకు ఉన్నాయి. ఈ కేంద్రం ఏర్పాటు, నిర్వహణ తీరు వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రతినిధి శ్రీధర్ ఇటీవల జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వివరించారు. ఆధార్ సవరణలు, బీమా డబ్బుల చెల్లింపులు, రైల్వే, విమాన టిక్కెట్ల బుకింగ్లు, ప్రధానమంత్రి కిసాన్ యోజన రిజిస్ట్రేషన్, పాన్కార్డుకు దరఖాస్తు చేయడం, తపాలా సేవలు వినియోగించుకోవడం, అయూష్మాన్భవ నమోదు, దాదాపు 300 సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒకరికి ఉపాధి లభిస్తోంది. వీటితో పాటు ఆయిల్సీడ్ కార్పొరేషన్ ద్వారా వంటనూనెతో పాటు 66 రకాల బ్రాండ్ల అమ్మకాలకు కూడా ఆ సంస్థ అవకాశం లభిస్తోంది.
ఆదాయ వనరులు పెంచుకునేలా..
సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలివ్వడం, వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ధాన్యం కొనుగోలు, ఎరువులు విత్తనాల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఛైర్మన్ల జీతభత్యాలు, సంఘాల కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అదనపు సిబ్బంది కూడా పని చేస్తున్నారు. దీంతో సంఘాల ఆదాయ వనరులు పెంచుకునేలా కార్యచరణ చేపడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందిస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలు అందేలా రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు రవీందర్రావు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ ఉత్పత్తులు కూడా విక్రయించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కామన్ సర్వీస్ సెంటర్ ఏప్రిల్లో ప్రారంభం అవుతోంది.
సత్యనారాయణరావు, సీఈవో, కేడీసీసీబీ, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?