బ్యాంకులో కాదు.. సొంతానికి జమ
మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా..
రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్ల నోటీసులు
లబోదిబోమంటున్న మహిళా సంఘాల సభ్యులు
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్
మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా.. కొందరు సంఘాలను నమ్మించి నెలనెలా వసూలు చేస్తున్న రుణ మొత్తాన్ని సొంతానికి వాడుకోవడం, బ్యాంకర్లు ఆ సంఘాలకు నోటీసులు ఇవ్వడంతో ఆలస్యంగా బయట పడుతున్నాయి.
కరీంనగర్ నగర పాలక సంస్థ, మెప్మా పరిధిలో రెండేళ్ల కిందట బినామీ సంఘాలు ఏర్పాటు చేసుకొని పలు బ్యాంకుల ద్వారా రూ.కోట్లు తీసుకొని ఎగనామం పెట్టగా.. బాధ్యులైన మెప్మా ఒప్పంద ఉద్యోగులను, ఆర్పీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే ఓ ఆర్పీ తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని పద్మశాలీ వీధిలో వసంతలక్ష్మి స్లమ్ సమాఖ్యలో 14 మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాలకు సంబంధించిన రుణాలను ప్రతి నెలా వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా పెత్తనం చేసి ఆ మొత్తాన్ని ఓ ఆర్పీ సొంతానికి వాడుకున్నారు. రుణాన్ని వసూలు చేసి బ్యాంకులలో జమ చేయకపోవడం, ఆఫీసు బేరర్ల(ఓబీ)కు తెలియకుండా పోవడంతో అనుమానాలు వచ్చి ఆరా తీశారు. సంఘాలలో తీసుకున్న రూ.1,90,000, సమాఖ్యలోని రూ.2,96,627 వాడుకున్నట్లు తేలింది. అదేవిధంగా వెంకటేశ్వర సంఘంలోని బ్యాంకు లింకేజీ రూ.2.50 లక్షలు బ్యాంకులో కట్టాల్సి ఉంది. స్త్రీనిధి రూ.3 లక్షలు అప్పుగా అలాగే ఉంచడం, ఆ సంస్థ మేనేజర్ తెలుపడంతో సంఘ సభ్యులు ఆందోళన చెందారు. మరో సభ్యురాలు సంఘం నుంచి వైదొలగగా ఆ పేరు మీద రూ.50 వేలు రుణం తీసుకున్నట్లు సంఘ సభ్యులు వివరించారు.
తాఖీదులతో ఆందోళన
సమాఖ్య పరిధిలో తీసుకున్న సంఘాలు బ్యాంకు ద్వారా రుణాలు సక్రమంగా చెల్లించడం లేదని, బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఓ బ్యాంకు ఆ సమాఖ్యకు నోటీసులు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆర్పీ నుంచి తీసుకున్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించే విధంగా చూడాలని కోరుతున్నారు. ఇలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల కొన్ని ఫిర్యాదులు రాగా అధికారుల హెచ్చరికలతో రుణాలు చెల్లిస్తున్నారు.
కమిషనర్కు, పీడీకి ఫిర్యాదు
సమాఖ్య, సంఘంలోని సభ్యుల దగ్గర నుంచి ప్రతినెలా బ్యాంకులో చెల్లించాల్సిన రుణాన్ని తీసుకొని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న ఆర్పీపై వసంతలక్ష్మి సమాఖ్యకు చెందిన 14 సంఘాల సభ్యులు నగరపాలక కమిషనర్, మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. సోమవారం నగర పాలక కార్యాలయానికి వచ్చి అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు కావడంతో బ్యాంకర్లు, స్త్రీ నిధి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మొర పెట్టుకున్నారు. సీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు లేకుండా పోయిందని, ఆర్పీ స్పందించడం లేదని ఆగ్రహించారు. సాయంత్రం వీరంతా ఏం చేయాలనే విషయంపై సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి, మేయర్, కలెక్టర్ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
చర్యలు తప్పవు
- రాజేశ్వర్, సహాయ కమిషనర్, నగర పాలిక
సంఘాల సభ్యుల రుణాలను బ్యాంకులకు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. సభ్యులు మొదట్లోనే అధికారుల దృష్టికి తేవాలి. ఆ సమయంలో రాకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ