Peddapalli: ఎంత పని చేశావు నాన్నా!
ఆ చిన్నారికి నాన్నతో కలిసి బైకుపై తిరగడమంటే ఎంతో ఇష్టం.. తాతయ్య, నానమ్మల వద్దకు వెళ్దామని అనేసరికి ఆనందంతో కేరింతలు కొట్టాడు.. అదే తన చివరి ప్రయాణమవుతుందని ఆ పసి మనసుకు తెలియదు..
కుమారుడిని బావిలో తోసి తండ్రి ఆత్మహత్యాయత్నం
దేవాన్ష్
పెద్దపల్లి, సుల్తానాబాద్, న్యూస్టుడే: ఆ చిన్నారికి నాన్నతో కలిసి బైకుపై తిరగడమంటే ఎంతో ఇష్టం.. తాతయ్య, నానమ్మల వద్దకు వెళ్దామని అనేసరికి ఆనందంతో కేరింతలు కొట్టాడు.. అదే తన చివరి ప్రయాణమవుతుందని ఆ పసి మనసుకు తెలియదు.. అల్లారుముద్దుగా చూసే తండ్రే తన ఆయుష్షు తీస్తాడని ఊహించలేదు..
కుటుంబ గొడవలతో మనస్తాపం చెందిన యువకుడు 17 నెలల కొడుకును చంపి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఎలిగేడు మండలం రాములపల్లిలో శనివారం చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి(30)కి భార్య మానస, కొడుకు దేవాన్ష్(17 నెలలు) ఉన్నారు. కొన్నేళ్లుగా తిరుపతిరెడ్డికి సోదరుడు రత్నాకర్రెడ్డికి మధ్య భూ వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. భూ సమస్య పరిష్కారం కాకపోగా రత్నాకర్రెడ్డి బంధువులు తిరుపతిరెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. ఈ నేపథ్యంలో తిరుపతిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా కుటుంబంతో సుల్తానాబాద్లో ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ పూజ కోసం భార్యా కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్ను తీసుకొని స్వగ్రామానికి వెళ్లాడు. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసి, వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.
స్వగ్రామం వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస మామ(భర్త తండ్రి) సంజీవరెడ్డికి ఫోన్ చేసింది. ఇంటికి రాలేదని చెప్పిన ఆయన పొలం వద్దకు వెళ్లి చూడగా బావి ఒడ్డుపై తిరుపతిరెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది. మనవడి కోసం గాలిస్తూ అనుమానంతో బావిలో చూడగా నీళ్లపై చెప్పులు తేలి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని నీటిని మోటార్లతో తోడి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతిరెడ్డిని మొదట సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రత్నాకర్రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తిరుపతిరెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత