పెరుగుతున్న ఔషధ వినియోగం
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.
కొవిడ్ సమయంలో అత్యధికం
కొవిడ్ కన్నా ముందు రూ.5 నుంచి రూ.6 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యేవని స్టోర్స్ అధికారులు తెలిపారు. 2021-22లో కొవిడ్ వల్ల అత్యధిక ఔషధ వినియోగం జరిగింది. ఆ సమయంలో రూ.12.93 కోట్ల విలువైన ఔషధాలు వినియోగించారు. 2022-23 సంవత్సరానికి రూ.6.76 కోట్ల విలువైన మందులు అందించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్ల మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల ఔషధాలు అధికంగా సరఫరా అయ్యాయి.
ఇంటింటికీ సరఫరా
రక్తపోటు, మధుమేహం వంటి వాటితో బాధపడేవారిని వైద్య, ఆరోగ్యశాఖ సర్వే ద్వారా గుర్తిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుర్తించిన వారందరికీ నెల నెలా మాత్రలు ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా వీటిని అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ కార్యాలయాలకు పంపిస్తే అక్కడి నుంచి బాధితులకు చేరుస్తారు. క్షయ, కుష్ఠు బాధితులకు కూడా మల్టీ డ్రగ్ థెరపీ విధానంలో ప్రత్యేక కిట్లను అందిస్తారు.
పెద్దాసుపత్రుల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగుల రాక ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. బోధన ఆసుపత్రుల్లో పలు విభాగాల వైద్యులు అందుబాటులో ఉండటం, వైద్య వసతులు మెరుగు పడటం వల్ల రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఆసుపత్రులకు అభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి. అత్యవసరమైన మందులు కమిటీ ఆమోదంతో కొనుగోలు చేసి వైద్యం అందిస్తున్నారు. కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి ప్రతీ వారానికోసారి, మిగిలిన మూడు జిల్లాల వైద్య కళాశాలల ఆసుపత్రులకు 15రోజులకు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు నెలకోసారి పంపిస్తున్నారు.
రెండు జిల్లాలకు ఒక గోదాము
కరీంనగర్ స్టోర్లో ఔషధ నిల్వలను పరిశీలిస్తున్న సిబ్బంది
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ, మాతాశిశు కేంద్రాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధ వినియోగం పెరుగుతోంది. వచ్చే స్టాక్ నిల్వ చేసేందుకు గోదాములు సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంది. ఇదేకాకుండా కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద కూడా గోదాము ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త భవనం నిర్మించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ భవనం ప్రారంభం కాగానే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు జగిత్యాల నుంచి మందులు సరఫరా అవుతాయి. కరీంనగర్, పెద్దపల్లికి కరీంనగర్ నుంచి వెళ్తాయి. ప్రభుత్వం ఏటా కేటాయించిన కోటా ప్రకారం మందులను ఆయా ఆసుపత్రులకు వాహనాల ద్వారా ఏ సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల