మండుటెండల్లో శ్రమజీవులకు ఊరట
మండుటెండలో శ్రమిస్తున్న ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. రెండేళ్లుగా నిలిపివేసిన తాగునీటి వసతి పునరుద్ధరణ బాధ్యతను పంచాయతీలకు కట్టబెట్టింది.
ఉపాధి కూలీలకు తాగునీటి వసతి బాధ్యత పంచాయతీలదే
ఉత్తర్వులు జారీ
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
మండుటెండలో శ్రమిస్తున్న ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. రెండేళ్లుగా నిలిపివేసిన తాగునీటి వసతి పునరుద్ధరణ బాధ్యతను పంచాయతీలకు కట్టబెట్టింది. కార్యదర్శుల సమన్వయంతో పనులు పర్యవేక్షించాలని రెండు రోజుల కిందట అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ పథకం కూలీలకు గతంలో వేసవి భత్యం, తాగునీటి బిల్లులు చెల్లించేవారు. రెండేళ్ల కిందట వీటిని రద్దు చేయడంతో కూలీలు దాహార్తితో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పంచాయతీలే నీటి సరఫరా బాధ్యత తీసుకోవాలని ఆదేశించడంతో కూలీలకు కాస్త ఊరట కలిగింది.
రెండేళ్లుగా నిలిపివేత
పల్లెల్లో నైపుణ్యం లేని కూలీలకు ఉపాధిహామీ కడుపు నింపుతోంది. ఏడాదిలో 100 రోజుల పాటు పని లభిస్తుండటంతో పేద కుటుంబాలకు సాంత్వన కలిగిస్తోంది. గతంలో వేసవిలో ఒక్కో కూలీకి రోజుకు రూ.5, మిగిలిన సీజన్లలో రూ.3 చొప్పున తాగునీటి బిల్లులను ఖాతాలో జమ చేసేవారు. పథకంలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్ల కిందట తీసుకొచ్చిన కొత్త విధానంలో తాగునీటి బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. కాగా పనుల ప్రణాళికలోనే తాగునీటి బిల్లులు ప్రతిపాదించాలని గత నెలలో అధికారులు ఆదేశించారు. అప్పటికే పనుల ప్రతిపాదనలు నివేదించడంతో తాగునీటి వసతిపై సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు తాగునీటి వసతిని పంచాయతీలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో కూలీల ఇబ్బందులు తీరనున్నాయి.
ప్రథమ చికిత్స కిట్ల జాడేదీ!
ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దపల్లిలో 1.18 లక్షల జాబ్కార్డుల్లో 2.41 లక్షల మంది కూలీలు, జగిత్యాలలో 1.67 లక్షల జాబ్కార్డుల్లో 2.73 లక్షల మంది, కరీంనగర్లో 1.23 లక్షల జాబ్కార్డుల్లో 2.30 లక్షల మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 97 వేల జాబ్కార్డుల్లో 1.98 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నా పని ప్రదేశాల్లో నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చడం లేదు. గతంలో కూలీలకు ప్రథమ చికిత్స కిట్లు అందజేసేవారు. వాటిని కూడా నిలిపివేయడంతో ప్రమాదవశాత్తు గాయాలపాలైన కూలీలకు సత్వర చికిత్స అందడం లేదు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుండగా కార్యదర్శులు వివిధ విధులతో సతమతమవుతున్నారు. ఉపాధిహామీ కూలీలకు తాగునీటి సరఫరా బాధ్యత అదనపు భారం కానుంది.
రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం
- రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
ఉపాధిహామీ కూలీలకు తప్పకుండా పంచాయతీలే తాగునీటిని సరఫరా చేయాలి. దీనిపై రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం. పని ప్రదేశాల్లో కూలీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి