పల్లె దవాఖానాలకు మోక్షమెప్పుడో?
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పల్లె దవాఖానాలు నిర్మించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గంభీరావుపేట మండలానికి నాలుగు పల్లె దవాఖానాలు మంజూరు కాగా అందులో రెండింటిని పూర్తి చేశారు.
న్యూస్టుడే, గంభీరావుపేట
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పల్లె దవాఖానాలు నిర్మించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గంభీరావుపేట మండలానికి నాలుగు పల్లె దవాఖానాలు మంజూరు కాగా అందులో రెండింటిని పూర్తి చేశారు. మిగతా రెండు చోట్ల పనులు ప్రారంభం కాలేదు. పూర్తి చేసిన వాటిని కూడా ఏడాదిగా ప్రారంభించడం లేదు. దీంతో గ్రామీణులకు వైద్య సేవలు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది.
గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేట, ముస్తఫనగర్, లింగన్నపేట గ్రామాల్లో పల్లె దవాఖానాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేటలో వీటికి భవనాలు నిర్మించారు. ఇందులో గంభీరావుపేట పల్లె దవాఖానాను సర్పంచులు పదవీ కాలంలో ఉన్న సమయంలోనే గంభీరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచి కటకం శ్రీధర్ పంతులు చేతుల మీదుగా ప్రారంభించారు. దమ్మన్నపేటలో ఇప్పటి వరకు ప్రారంభించలేదు. నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం దాటిపోతున్నప్పటికీ ప్రారంభించకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముస్తఫనగర్, లింగన్నపేట గ్రామాల్లో నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదు. పూర్తి చేసినవి ప్రారంభించక, మిగతా చోట్ల పనులు చేపట్టక ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అధికారులు మిగతా రెండు పల్లె దవాఖాల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తయిన వాటిని ఎన్నికల కోడ్ ముగిసిన తరవాత అయినా ప్రారంభించి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉపయోగంలోకి తీసుకురావాలి
- కర్ణల నరేశ్, గంభీరావుపేట
గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన పల్లె దవాఖానాను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. విద్య, వైద్యం పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. నిర్మించి నిరుపయోగంగా ఉంచడం వల్ల ఉపయోగం లేదు. గంభీరావుపేటలో అద్దె భవనాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే దవాఖానాను ఉపయోగంలోకి తీసుకురావాలి.
త్వరలోనే వైద్య సేవలు
- వేణుగోపాల్రెడ్డి, లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారి
దమ్మన్నపేట, గంభీరావుపేటలో నిర్మించిన పల్లె దవాఖానాల భవనాలను గుత్తేదారు ఇప్పటి వరకు మాకు అప్పగించలేదు. గంభీరావుపేటలో ప్రారంభించినప్పటికీ దానిని కూడా అప్పగించలేదు. పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రెండు గ్రామాల్లో వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?