చెక్డ్యాంల ఆకృతిలో మార్పులు
జిల్లాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించే లక్ష్యంతో చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్లుగా అసంపూర్తి పనులతో ప్రహసనంగా మారాయి.
అధికారుల నిర్ణయం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
జిల్లాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించే లక్ష్యంతో చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్లుగా అసంపూర్తి పనులతో ప్రహసనంగా మారాయి. 2020లో మానేరుపై 11, మూలవాగుపై 13 చెక్డ్యాంల నిర్మాణానికి రూ. 140.26 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో మానేరుపై నాలుగు, మూలవాగుపై నాలుగు చెక్డ్యాంలు మాత్రమే వందశాతం పూర్తయ్యాయి. మిగతా చోట్ల 50 నుంచి 80 శాతం పనులు జరిగాయి. ఇవి మొత్తం పూర్తయితే జిల్లాలో సుమారు 40 గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు ఏడాది పొడవునా నిలకడగా ఉండే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగని పరిస్థితి. చెక్డ్యాంల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, పలుచోట్ల వరదలకు కొట్టుకుపోయి కోతకు గురైన తీరుపై ఇటీవల కలెక్టర్ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో అధ్యయనం చేయించి నివేదిక తెప్పించారు. వాటి ఆధారంగా చెక్డ్యాంల ఆకృతిలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
నిర్మాణ లోపాలే శాపాలు
రెండు వాగులు 120 నుంచి 230 మీటర్ల వెడల్పులతో ఉన్నాయి. వీటిపై నిర్మించే చెక్డ్యాంలన్నీ ఒకే ఆకృతితో నిర్మిస్తున్నారు. దీనికితోడు నిర్మాణం చేసే ప్రదేశం ఎంపిక, అక్కడి మట్టి నమూనాల సేకరణ, వరద ప్రవాహ వేగాన్ని అంచనా వంటివేవీ చేయలేదు. 2020కి ముందు నాలుగేళ్లు రెండు వాగుల్లోనూ భారీ వరదలు రాకపోవడమే ఇందుకు కారణం. తర్వాత వరుసగా మూడేళ్లు వరదల ఉద్ధృతికి నిర్మాణ దశలోనే చాలా వరకు కొట్టుకుపోయాయి. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్, ఎల్లారెడ్డిపేట మండలం పదిరి, కోనరావుపేట మండలం మామిడిపల్లి, వేములవాడ మండలం జయవరంలో నీటి ప్రవాహానికి కోతకు గురికావడంతో డిటోనేటర్లు పెట్టి పేల్చేశారు. పనులు జరిగిన చోట గైడ్వాల్స్ కోతకు గురికావడం, సిమెంటు బెడ్స్ కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల పగుళ్లు బారాయి.
ప్రతిపాదనల్లో మార్పు
ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత తొమ్మిది నెలలు వర్షాలు, వరదలతో వాగులో నీటి ఊటలు పెరగడంతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది. మొదటి నుంచి నాణ్యత, పర్యవేక్షణ లోపాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. వైఫల్యాలు బయట పడినచోట కనీస చర్యలు లేకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. చెక్డ్యాంల వద్ద పొలాలు వరదలకు కోతకు గురై రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం చెక్డ్యాంలకు ఇరువైపులా సిమెంటు వాల్స్ నిర్మించాలని సూచించారు. వీటికి రక్షణగా మట్టితో నింపి బండలతో రివిట్మెంటు చేయాలి. వరద ప్రవాహం ఉన్న చోట బెడ్ ఎత్తు నిర్ణయించాలి. దీనికి స్థానికంగా లభించే మట్టి కాకుండా ఎర్రమట్టిని వాడాలి. ఇలా ఒక్కో చెక్డ్యాంపైన అంచనాలు పెరిగే అవకాశం ఉంది. తొలి విడతనే 24 చెక్డ్యాంలకు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. రెండో విడత 100 మీటర్ల వెడల్పుతో ఉన్న చిన్న వాగులకు 14 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిర్మాణాలు చేపడుతున్న వాటిలో ఒక్కొక్కటి రూ. 1.5 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 7 కోట్ల వరకు కేటాయించారు.
అనుమతులొచ్చాక పనులు
- శ్రీనివాస్, డీఈ
అసంపూర్తి దశలో ఉన్న చెక్డ్యాంల్లో లోపాలను గుర్తించి అవసరమైన పనులకు తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్కో నిర్మాణంపై 10 నుంచి 15 శాతం వ్యయం పెరిగే అవకాశం ఉంది. వీటిని ఉన్నతాధికారులకు పంపించి అనుమతులు మంజూరయ్యాక పనులు ప్రారంభిస్తాం. అగ్రిమెంటు చేసుకున్న దాని ప్రకారం మొత్తం పనులు చేయాల్సిన బాధ్యత గుత్తేదారుపైనే ఉంటుంది. ఇప్పటికే చాలా వాటికి గడువు పొడిగిస్తూ వచ్చాం. జూన్ 30లోగా అన్ని చెక్డ్యాంలు పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్