ప్రత్యేక ప్రణాళికలు.. తాగునీటి సరఫరా
ఎండల తీవ్రతతో పాటు ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో నగరపాలక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ అన్నారు.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
ఎండల తీవ్రతతో పాటు ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో నగరపాలక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ అన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాల పెంపు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నగరపాలిక పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ‘న్యూస్టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వివరించారు.
ప్రశ్న: నగరంలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యలు?
సమాధానం: రామగుండం నగరపాలిక ప్రాంతంలో నీటి సరఫరాకు ప్రధాన ఆధారం ఎల్లంపల్లి జలాశయమే. వేసవి తీవ్రతతో పాటు వివిధ కారణాలతో ఎల్లంపల్లిలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. నగరపాలికకు చెందిన రెండు ట్యాంకర్లతో అవసరమైన కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నాం. మరో అయిదు ట్యాంకర్లను అద్దెకు తీసుకోనున్నాం. పరిసరాల్లోని వ్యవసాయ బావులను అద్దెకు తీసుకొని అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం. ట్యాంకర్లలో నీరు నింపేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎన్టీపీసీ, సింగరేణి అధికారులకు లేఖలు రాశాం. గోదావరి ఒడ్డున గల నగరపాలక హెడ్ వర్క్సు వద్ద ట్యాంకర్లలో నీటిని నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నీటిని ఉద్యానవనాలు, రహదారి పక్కనున్న మొక్కలకు వినియోగిస్తాం.
ప్ర: ప్రజల నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుతున్నారు?
స: ప్రజలు ఎండవేళలో బయటకు రాకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. నగరంలోని తమ నివాసాల్లో బోరుబావి పక్కన ఇంకుండు గుంతలు నిర్మించుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలి. చెత్తను రోడ్లు, మురుగు కాలువల్లో వేస్తే జరిమానాలు విధిస్తాం. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగించకూడదు.
ప్ర: నీటితొట్ల ఏర్పాటునకు ఎలాంటి ప్రణాళికలు చేపడుతున్నారు?
స: వేసవి తీవ్రత పెరుగుతున్నందున పశుపక్షాదుల దాహార్తి తీర్చేలా నీటితొట్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తాం. వివిధ కాలనీల్లో స్థానికుల సహకారంతో నిర్వహణ చేపడతాం. ప్రతిరోజు తొట్లలో నీరు నింపేలా చర్యలు తీసుకుంటాం. మూగజీవాల దాహార్తి తీర్చడం కోసం మానవతా దృక్పథంతో ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలి.
ప్ర: నగరంలో లీకేజీల నివారణ, బోరుబావుల మరమ్మతులు ఏమేరకు వచ్చాయి.?
స: నగరంలో పలు చోట్ల గుర్తించిన పైపులైన్ల లీకేజీకి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నాం. లీకేజీల నివారణ కోసం ప్రత్యేకంగా టెండరు నిర్వహించి గుత్తేదారుకు పనులు అప్పగిస్తాం. బోరుబావుల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.10 లక్షలతో విడిభాగాలు తెప్పించాం. ఫిర్యాదుల ఆధారంగా ఆయా కాలనీల్లోని బోరుబావులకు మరమ్మతులు చేయిస్తున్నాం. కొన్ని బోరుబావుల్లో నీరు అడుగునకు పోవడంతో అదనంగా పైపులు వేయిస్తున్నాం. లీకేజీలను అరికట్టడం, బోరుబావుల మరమ్మతు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నగరపాలక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం.
ప్ర: ఇంకుడు గుంతల ఏర్పాటునకు కార్యాచరణ?
స: ఇటీవలి కాలంలో రామగుండం నగరపాలికలో 115 భవనాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చాం. వారంతా తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే వారందరికీ నోటీసులు జారీ చేస్తూ వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించాం. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నాం. 300 చదరపు మీటర్లకు మించిన వైశాల్యం కలిగిన ప్రతీ ఇంట తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి. నగరపాలక అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేయడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వ స్థలాలను చూపిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్