తెలంగాణలో భాజపా ముందంజ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ గాలి వీస్తుందని తెలంగాణలో వన్ సైడ్ వేవ్ నడుస్తుందని, భాజపా పెద్ద మెజార్టీతో ముందుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
ఎంపీ అర్వింద్
మెట్పల్లి పట్టణం, న్యూస్టుడే: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ గాలి వీస్తుందని తెలంగాణలో వన్ సైడ్ వేవ్ నడుస్తుందని, భాజపా పెద్ద మెజార్టీతో ముందుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని అంబేడ్కర్నగర్లో భాజపా ఆధ్వర్యంలో చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపాకు 370 పైగా సీట్లు వస్తాయని, ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకముందు భాజపా, భారాస దోస్తీ అని బద్నాం చేశారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి 47 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పుకో దగ్గ ఒక్క పనైనా ఎక్కడైనా చేశారా అని విమర్శించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తర్వాత జులై 4న ముత్యంపేట, బోధన్ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి, నడిపించి ఇక్కడి ప్రాంతం కళకళలాడేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసిన రైతు నాయకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయిరాంకాలనీలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు సంపత్ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, చెట్లపల్లి సుఖేంధర్గౌడ్, కౌన్సిలర్లు మీనా, పోచయ్య, నవీన్, శ్రీకాంత్ బొడ్ల నగేష్, ఆనంద్, వడ్డేపల్లి శ్రీనివాస్, ఏలేటి ముత్తయ్యరెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగుకు బాసట.. స్వావలంబన బాట
[ 26-07-2024]
సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. సంక్షేమంపై దృష్టి పెడుతూ సాగిన రాష్ట్ర పద్దులో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు.. -
పాఠశాలల్లో చరవాణుల వినియోగానికి తెరపడేనా..!
[ 26-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనివేళల్లో చరవాణులు వాడుతూ బోధన చేయడం లేదని పలువురు జిల్లా ఉన్నతాధికారులు వారి సందర్శన సమయంలో గుర్తించారు. -
ఊతమిస్తే కదా.. పతకాల ఊసు
[ 26-07-2024]
రెండు వందలకుపైగా దేశాలు 11వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారో త్వరలోనే తేలనుంది. -
వంతు వచ్చేవరకు..ఉగ్గబట్టుకోవాల్సిందే..!
[ 26-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధుల కొరతతో చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 26-07-2024]
చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
[ 26-07-2024]
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
ముసుగేసిన వ్యాపారాలు
[ 26-07-2024]
ఆషాఢానికి తోడు నాలుగు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. -
జనన ధ్రువపత్రాలకు అగచాట్లు
[ 26-07-2024]
పురపాలక కార్యాలయంలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ నెల రోజులుగా నిలిచిపోవడంతో దరఖాస్తులు పేరుకుపోయాయి. -
ఎంపిక సరే.. ప్రోత్సాహకమేదీ?
[ 26-07-2024]
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది.