నిరుద్యోగులకు వరం.. పోటీ పరీక్షల సమాచారం
సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా పలు కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
న్యూస్టుడే, జ్యోతినగర్(మార్కండేయకాలనీ)
సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా పలు కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మళ్లీ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తుండటంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. కొందరు పోటీ పరీక్షల శిక్షణ కోసం మళ్లీ హైదరాబాద్ బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పోటీ పరీక్షలపై ఆశలు పెట్టుకుని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
డిజిటల్ గ్రంథాలయంతో మేలు...
నిరుద్యోగులు స్థానికంగా ఉన్న గ్రంథాలయాలు ఉపయోగించుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగం ఉండదనేది విద్యావేత్తల భావన. స్థానికంగా కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తే పోటీ పరీక్షల సిలబస్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే గ్రూపు-1, 2, డీఏవో పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. వీటితో పాటు యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఖాళీల భర్తీకి పోటీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించనున్నాయి.
అందుబాటులో 68 లక్షల పుస్తకాలు
పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కొనలేనివారు, శిక్షణ కేంద్రాల్లో ఫీజులు చెల్లించే పరిస్థితులు లేనివారికి అంతర్జాలం ఎంతో తోడ్పాటు అందిస్తోంది. జాతీయ డిజిటల్ గ్రంథాలయం(ఎన్డీఎల్) నిరుద్యోగులకు చక్కటి వేదికగా మారింది. ఆన్లైన్లో పలు పోటీ పరీక్షల సమాచారంతో పాటు ఆయా పరీక్షలకు ఉపయోగపడే సిలబస్కు సంబంధించిన పుస్తకాలు ఎన్డీఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ‘జాతీయ విద్యా శిక్షణ పరిశోధన’ సంస్థ(ఎన్సీఈఆర్టీ) రూపొందించిన పలు పాఠ్యంశాలకు సంబంధించిన పుస్తకాలు, దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు రూపొందించిన పరిశోధన వ్యాసాలు సైతం ఎన్డీఎల్లో ఉన్నాయి. విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ఆరు విభాగాలు ఇందులో ఉన్నాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.
సద్వినియోగం చేసుకొనే వెసులుబాటు
-ఏ.వీ.ఎన్.రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి
డిజిటల్ సమాచారం ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ప్రతి అభ్యర్థి తమ ఆలోచన విధానాన్ని బట్టి తమకు కావాల్సిన పాఠ్యాంశాన్ని సద్వినియోగం చేసుకునే వెసులుబాటు ఉంటోంది. డిజిటల్ గ్రంథాలయంలో అరుదైన గ్రంథాలు, భౌతికంగా నిల్వ ఉంచిన పేపర్లు, పాత పత్రికలు, తాళపత్ర గ్రంథాల్లోని ప్రతి పేజీని స్కాన్ చేసి సాఫ్ట్కాపీలుగా అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి వీటిని చదివిందుకు, వినేందుకు ఆడియో, వీడియో సౌకర్యం సైతం ఉంది. యువత దీనిని వినియోగించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం