శత శాతమే లక్ష్యం.. సంధించాలి అస్త్రం
ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి ఓటరూ తన హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు.
వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్ద ఓటేసే అవకాశం
శాసనసభ ఎన్నికల్లో అవగాహన లోపంతో చాలా మంది దూరం
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి ఓటరూ తన హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా బీఎల్వోలు(బూత్ లెవెల్ అధికారులు) ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులకు 12-డీ పత్రాలు పంపిణీ చేస్తున్నారు.
వసతులు కల్పిస్తున్నా..
ప్రతి ఎన్నికల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దివ్యాంగులను, వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు సమకూర్చుతున్నారు. పోలింగ్ బూత్ల వద్ద ర్యాంప్లు నిర్మించడంతో పాటు నడవలేని వారికి వీల్ ఛైర్ ఏర్పాటు చేస్తున్నారు. అయినా పోలింగ్ శాతం పెరగడం లేదు. వృద్ధులు, దివ్యాంగులకు ఓటేయాలని ఆసక్తి ఉన్నా, అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం, నడవలేని స్థితిలో ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు రాలేకపోతున్నారు.
నోటిఫికేషన్ తర్వాత 5 రోజులు
- మంచానికే పరిమితమైన దివ్యాంగులు, వృద్ధుల గుర్తింపునకు బీఎల్వోలు అయిదు రోజులుగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
- 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, ఓటరు గుర్తింపు కార్డులో 85 ఏళ్లు దాటి ఉన్న వారు ఇంటి నుంచి ఓటేయడానికి అర్హులు. బీఎల్వోలు సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, వారికి 12-డీ ఫారం అందజేస్తున్నారు.
- 12-డీ ఫారంలో వివరాలు ఎలా పూరించాలో బీఎల్వోలు వివరిస్తున్నారు. పూరించలేని పరిస్థితిలో స్వయంగా వివరాలు నమోదు చేస్తున్నారు. ్య ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా అనంతరం అయిదు రోజుల వరకు 12-డీ ఫారాలు స్వీకరించనున్నారు.
శాసనసభ ఎన్నికల్లోనే మొదటిసారి..
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 17,88,392 మంది ఓటర్లుండగా ఇందులో 13,273 మంది వృద్ధులు, 43,579 మంది దివ్యాంగులున్నారు. పెద్దపల్లి పరిధిలో 15,92,996 మంది ఓటర్లకు 8,692 మంది వృద్ధులు, 35,099 మంది దివ్యాంగులు, నిజామాబాద్(జగిత్యాల, కోరుట్ల) పరిధిలో 4,78,868 మంది ఓటర్లకు 7,821 మంది వృద్ధులు, 20,946 మంది దివ్యాంగులున్నారు. ఇంటి వద్ద ఓటేసే విధానాన్ని మొదటిసారి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టడంతో ప్రచార లోపంతో ఆశించిన మేర ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వారీగా దివ్యాంగ, వృద్ధ ఓటర్లను గుర్తించి ఫారాలు పంపిణీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల