వృద్ధులకు ఆపన్నహస్తం
కన్నబిడ్డల కరుణకు దూరమైన వారు కొందరు.. ఏతోడు లేక ఆదరణ కరవైన వారు మరికొందరు.. జీవిత చరమాంకంలోని పండుటాకులకు అన్ని తామై చేయూత అందిస్తున్నారు.
న్యూస్టుడే, రాయికల్
కన్నబిడ్డల కరుణకు దూరమైన వారు కొందరు.. ఏతోడు లేక ఆదరణ కరవైన వారు మరికొందరు.. జీవిత చరమాంకంలోని పండుటాకులకు అన్ని తామై చేయూత అందిస్తున్నారు. వృద్ధాప్యంలో తోడు నీడగా ఉంటూ నేనున్నానని మీకేంకాదని భరోసా కల్పిస్తూ మాధవ సేవతో పాటు మానవ సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీమతి చెన్నమనేని నివేదిత కృష్ణారావు.
రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎ.ఎన్.ఎల్. పార్శిల్ అధినేత దివంగత సి.హెచ్.ఎన్వీ కృష్ణారావు-నివేదిత దంపతులు వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. సొంత గ్రామానికి సేవ చేయాలని పలు గ్రామాల్లో ఆలయాలు నిర్మించారు. తన భార్య నివేదిత కోరిక మేరకు గ్రామ శివారులోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 10 ఎకరాలలో 2015లో నివేదిత వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏతోడు లేని అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత వసతితో పాటు భోజనాన్ని అందజేస్తున్నారు. 30 నుంచి 40 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క రాయికల్ మండల కేంద్రానికే పరిమితం కాకుండా జిల్లాలోని పలు గ్రామాల నుంచి వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. దినపత్రికలు, పుస్తకాలతో పాటు వారి కాలక్షేపానికి టి.వి. తదితర ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలకు సైతం వసతులు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. 2017లో కృష్ణారావు మృతి చెందినా నివేదిత ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం 36 మంది వృద్ధులు ఉండగా మరో 50 మందికి వసతి గదుల నిర్మాణం పూర్తి చేశారు. సాయప్ప ట్రస్టు ద్వారా రాయికల్ అయ్యప్ప ఆలయం, గణపతి ఆలయం, ఇటిక్యాల, కట్కాపూర్ గ్రామాల్లో సాయిబాబా ఆలయంతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఆలయాలు నిర్మించారు. ఓవైపు ఆధ్యాత్మికతతో పాటు మరోవైపు సామాజిక సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆయన ఆలోచనే స్ఫూర్తి
- సీహెచ్ఎన్వీ నివేదిత కృష్ణారావు
మా ఆయన పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో గ్రామంలో ఆలయంతో పాటు నివేదిత ఆశ్రమాన్ని నిర్మించారు. 22 ఏళ్లుగా సాయ్యప్పట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మావారి ఆలోచన స్ఫూర్తి, గ్రామస్థుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. నివేదిత ఆశ్రమంలో వృద్ధులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ