ఆరంభంలో అధికం.. ప్రస్తుతం మధ్యమం
వేసవికాలం ఆరంభం మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో 41 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధిక సమయం నడపడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరిగాయి.
వేసవిలో విద్యుత్తు వినియోగం తీరిది
భగభగ నుంచి సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు
న్యూస్టుడే, భగత్నగర్
వేసవికాలం ఆరంభం మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో 41 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధిక సమయం నడపడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరిగాయి. మరో వైపు వరికి పంటకు మరో పది రోజుల వరకు తడి అందించాల్సి రావడంతో బోరుబావుల మోటార్లు విరామం లేకుండా తిరుగుతున్నాయి. ఎండ వేడికి పగలు, రాత్రి మోటారు తిరిగితేనే గానీ పంటలకు తడి అందించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి.. మబ్బులు పడటం.. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండటంతో కరెంటు వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది.
బోరుబావులపైనే ఆధారం..
జిల్లాలో యాసంగిలో 3.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి సాగు 2.50 లక్షల ఎకరాలు. జలాశయాల్లో నీరు అడుగంటడంతో బోరుబావులపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో 10,00,932 వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. జోరుగా బోరు బావులు ఉపయోగించడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. జనవరిలో సగటు జలమట్లం 6.67 మీటర్లు ఉంటే ప్రస్తుతం 8.43 మీటర్లకు పడిపోయింది. బోర్లలో నీరందక చివరి మడి తడవక రైతులు విద్యుత్తు మోటార్లను 18 గంటలపాటు విరామం లేకుండా వినియోగిస్తున్నారు. జిల్లాలో విద్యుత్తు వినియోగంతోపాటు గరిష్ఠ డిమాండ్ మాధ్యమ స్థాయికి వచ్చింది. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బహుబలి మోటార్లు నీటిని ఎత్తిపోయడంతో విద్యుత్తు వినియోగం పెరిగితే, ప్రస్తుతం వ్యవసాయ బోరుబావుల వినియోగం.. గృహాల్లో శీతలోపకరణాల వినియోగంతో ఆ స్థాయిలో పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
శీతలోపకరణలకు డిమాండు..
జిల్లాలో 5,40,966 వివిధ విద్యుత్తు కేటగిరీ సర్వీసులు ఉండగా, ఇందులో 3,70,880 గృహ సర్వీసులున్నాయి. వేసవి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున కూలర్లు ఏయిర్ కండీషన్లు వాడుతున్నారు. ఆయా కంపెనీలు ఏసీలను సులభ వాయిదాల్లో ఇస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఒకప్పుడు వేసవిలో రోజుకు రెండు, మూడు ఏసీలు విక్రయించే దుకాణాలు ప్రస్తుతం 7 నుంచి 8 వరకు విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గృహావసరాలకు ఉదయం.. సాయంత్రం విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మబ్బుపడితే తగ్గి.. వీడితే పెరిగి..
వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతూ.. మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోంది. 44 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 35 డిగ్రీలు సెల్సియస్కు పడిపోయాయి. విద్యుత్తు వినియోగం డిమాండ్ ఆ మేరకు పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..