అక్రమాలపై విజిలెన్స్ విచారణ
పలు విభాగాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు తరచూ వెలుగు చూడటంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్ విభాగం జగిత్యాల పురపాలికకు ఈ నెల 3న తాఖీదులు జారీ చేసింది.
జగిత్యాల బల్దియాలో పారిశుద్ధ్యం, టౌన్ప్లానింగ్ వివరాలు సమర్పించాలని ఆదేశం
జగిత్యాల పురపాలిక కార్యాలయం
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: పలు విభాగాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు తరచూ వెలుగు చూడటంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కరీంనగర్ విభాగం జగిత్యాల పురపాలికకు ఈ నెల 3న తాఖీదులు జారీ చేసింది. పారిశుద్ధ్య, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పుర కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు ఆయా రికార్డులు బల్దియా అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెండేళ్లుగా కమిషనర్లు మారటంతోపాటు ఏడాదిగా బల్దియాకు తాత్కాలిక అధ్యక్షుడే ఉండటంతో ప్రజాధనం దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్ష సభ్యులు అక్రమాలను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఆరోపణలివీ..
పురపాలక సంఘంలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి చెత్త సేకరణ వాహనాలు తరచూ మరమ్మతుకు గురైనట్లు చూపి రెండేళ్లలో రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశారు. మరోవైపు డీజిల్ వినియోగంలోనూ ఎలాంటి కూపన్లు లేకుండా ప్రతినెలా రూ.3 నుంచి రూ.4 లక్షల మేర దుర్వినియోగం చేశారు. దీనికి ప్రతినెలా బిల్లుల్లో వచ్చిన తేడాలు స్పష్టం చేస్తున్నాయి. వాహనాలకు జియోట్యాగింగ్ లేకుండా మూడేళ్లకుపైగా వినియోగిస్తున్నారు. కావాలనే వాహనాల జియోట్యాగింగ్ తొలగించారనే ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందికి బయోమెట్రిక్ విధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో టీఎస్బీపాస్ ఆన్లైన్ విధానం ఉన్నప్పటికీ ఆఫ్లైన్లో కొందరు సిబ్బంది యజమానుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అసెస్మెంట్ ధ్రువీకరణపత్రాల పేరిట కూడా అక్రమాలు చోటుచేసుకోవడం వివాదాస్పదమైంది.
కోరిన వివరాలివే..
- పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించిన బడ్జెట్, కొనుగోలు చేసిన వాహనాలు, మరమ్మతులకైన ఖర్చులు, వాహనాల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
- సీజనల్ వ్యాధులపై ఇప్పటి వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు.
- ప్లాస్టిక్ నిషేధం ఏ విధంగా అమలు చేస్తున్నారు. దాడుల్లో దొరికిన ప్లాస్టిక్ ఎక్కడ భద్రపరిచారు, ఎక్కడికి తరలిస్తున్నారు.
- బయోమెట్రిక్ హాజరు విధానం తీరు, సిబ్బంది వివరాలు కోరారు.
- పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు నిబంధనల మేరకు జారీ చేస్తున్నారా? అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు తదితర వివరాలు సమర్పించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల