రాయితీ విత్తనాలపై రైతుల ఆశలు
వచ్చే వానాకాలం సీజనునుంచి రాయితీ విత్తనాల సరఫరాను పునరుద్ధరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం రైతులకు ఆశగా మారింది. వానాకాలం సీజనుకు విత్తనాలు ఇవ్వాలంటే ఇప్పట్నుంచే మేలైన వంగడాలను ప్రభుత్వం సేకరించి సరఫరాకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు
మార్కెట్లో వరి విత్తన సంచులు
వచ్చే వానాకాలం సీజనునుంచి రాయితీ విత్తనాల సరఫరాను పునరుద్ధరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం రైతులకు ఆశగా మారింది. వానాకాలం సీజనుకు విత్తనాలు ఇవ్వాలంటే ఇప్పట్నుంచే మేలైన వంగడాలను ప్రభుత్వం సేకరించి సరఫరాకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
- గతంలో అన్నిరకాల పంటల విత్తనాలను 50 శాతం రాయితీపై అందించేవారు. కొన్నేళ్లుగా కేవలం జనుము, జీలుగ విత్తనాలను మాత్రమే అత్యంత పరిమితంగా రాయితీపై ఇస్తున్నారు. దీంతో రైతులు బయటి మార్కెట్లో ప్రైవేటు విత్తనాలను పూర్తిధరకు కొనుగోలు చేసి ఆర్థిక భారానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కూరగాయలు సహా అన్నిరకాల విత్తనాలను రాయితీపై అందిస్తే రైతులకు ఆర్థిక ఆసరాగా ఉంటుంది.
- వానాకాలం సీజన్లో జిల్లాలో పరిస్థితులు అనుకూలిస్తే 4.34 లక్షల ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలను సాగుచేస్తారు. ఇందులో వరిసాగే 3 లక్షల ఎకరాలుగా ఉండనుండగా గతంలో మాదిరిగా తెలంగాణ విత్తన, జాతీయ విత్తన కంపెనీ ద్వారా, జాతీయ ఆహార భధ్రత పథకంద్వారా విత్తనాలను రాయితీపై ఇవ్వాల్సిఉంది. ఇందుకు ఇప్పట్నుంచే రైతులనుంచి విత్తనాలను సేకరించి నిల్వచేస్తేనే వానాకాలంలో సరఫరా సాధ్యపడుతుంది.
- కంపెనీలను బట్టి 5 కిలోల మొక్కజొన్న విత్తన ప్యాకెట్కు రూ.350 నుంచి రూ.1,500 వరకు ధరుండటంతో రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ సరఫరా లేనందున విత్తనాల ధరల నిర్ణయం కంపెనీల ఇష్టానుసారం మారి విత్తనాల ధరలు రెండేళ్లలోనే రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై విత్తనాలిస్తే కంపెనీలు కూడా ధర తగ్గిస్తాయి. జిల్లాలో అన్నిపైర్ల సాగు విస్తీర్ణాన్నిబట్టి రూ.90 కోట్లవరకు వెచ్చిస్తుండగా గతంలో మాదిరిగా ప్రభుత్వం 50 శాతం రాయితీని పునరుద్ధరిస్తే రూ.45 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆర్థిక లబ్ధి కలుగుతుంది. సర్కారు సరఫరాతో మేలైన విత్తనాలు తక్కువ ధరలు అందుబాటులోకి వస్తాయి, ప్రైవేటు కంపెనీల విత్తనాల ధరలు కూడా దిగివస్తాయి కాబట్టి సర్కారు విత్తన రాయితీపై రైతులు ఆశగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?