డబ్బా నీరు సురక్షితమేనా!
ప్రభుత్వ అనుమతి లేకుండా.. కనీస ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్) అనుమతులు పొందకుండా నీటిని విక్రయిస్తున్నారు.
కనీస ప్రమాణాలు పాటించని నీటి శుద్ధి కేంద్రాలు
ఆటోలో తాగునీటి డబ్బాల రవాణా
న్యూస్టుడే, మెట్పల్లి, కోరుట్ల : ప్రభుత్వ అనుమతి లేకుండా.. కనీస ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్) అనుమతులు పొందకుండా నీటిని విక్రయిస్తున్నారు. ఇటీవల మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయగా మెట్పల్లిలో కేవలం ఒక ప్లాంటుకే అనుమతి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఒకవైపు నీరు సురక్షితమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు శుద్ధికేంద్రాల నీరు తాగేదుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పదుల సంఖ్యలో నీటిశుద్ధికేంద్రాలు వెలుస్తున్నాయి. వీటితో పాటు నీటిని విక్రయించే దుకాణాలు వీధికొకటి ఉంది. 20 లీటర్ల సాధారణ డబ్బా నీటిని రూ.10, చల్లని నీటిని రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.5కే నింపుతున్నారు. కోరుట్లలో సుమారు 40 వరకు నీటి శుద్ధి ప్లాంట్లు ఉండగా ఒక్కదానికి అనుమతులు లేవు. మెట్పల్లిలో అయిదారు నీటి శుద్ధి ప్లాంట్లతో పాటు నీటిని విక్రయించే దుకాణాలు 30 వరకు ఉన్నాయి. వీటిలో ఒక్క దానికి మాత్రమే ఐఎస్ఐ లైసెన్సు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పల్లెల్లో సైతం ఊరికొక నీటి శుద్ధి కేంద్రం ఉంది.
నిబంధనలిలా..
ప్రతి నీటిశుద్ధి ప్లాంటుకు బీఐఎస్ ధ్రువపత్రం ఉండడంతో పాటు ట్రేడ్ లైసెన్సు, ఆహార కల్తీ నియంత్రణ, తూనికల, కొలతల శాఖ అనుమతి తప్పనిసరి. నీటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు ప్రయోగశాల, పరిశుభ్రత పాటించాలి. వాల్టా చట్టం కింద రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పరికరాలను నిబంధనల ప్రకారం ఉపయోగించాలి. నీటిని నింపే డబ్బాలను క్రమం తప్పకుండా శుద్ధిచేయాలి. నిర్ణీత మోతాదులో మినరల్్్స ఉండేలా చూసుకోవాలి. ఇందుకు మైక్రోబయాలజీ, కెమిస్టు నిపుణులను నియమించుకోవాలి.
పట్టించుకునేదెవరు?
వేసవి కావడంతో శుద్ధికేంద్రాల్లో నీటి విక్రయాలు జోరందుకున్నాయి. శుభకార్యాలకు సైతం నీటి వినియోగం పెరుగుతోంది. మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ, ఆహార కల్తీ నియంత్రణ, తూనికల, కొలతల శాఖలు శుద్ధి కేంద్రాల విషయంలో పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, తనిఖీలు పూర్తిస్థాయిలో జరపకపోవడం వల్ల నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిస్తుండగా, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కేంద్రాలు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ను ‘న్యూస్టుడే’ సంప్రదించగా మెట్పల్లిలో ఇటీవల తనిఖీలు చేయగా ఒక్క నీటి శుద్ధి ప్లాంటుకే ఐఎస్ఐ లైసెన్సు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని కొన్ని ప్లాంట్లకు జరిమానా విధించామని, నిర్వాహకులు లైసెన్సు కలిగి ఉండాలని చెప్పామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?