పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీ
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
జిల్లాలో 309 ఎంపికలు
ముస్తాబాద్ మండలం పోత్గల్ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి స్థానంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో యూడైస్ ఆధారంగా 309 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపికైన వాటిలో మన ఊరు- మనబడి కింద ఎంపికైనవి కూడా కొన్ని ఉండటంతో వాటిని తొలగించి, ఆ స్థానంలో మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను చేేర్చారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఇంజినీరింగ్ అధికారులు ఎంపికైన పాఠశాలలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన తర్వాత డబ్బులు తీసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో జాతీయ బ్యాంకులో ఖాతాలను తెరుస్తున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలల కమిటీలు ఖాతాలు తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.25 వేల లోపు విలువైన పనులు చేసిన తర్వాత పాఠశాలలో కమిటీ సమావేశమై డబ్బులను విత్డ్రా చేయనున్నారు. అలాగే రూ.లక్ష వరకు పనులకు ఎంపీడీవో అనుమతితో విత్డ్రా చేయనున్నారు. రూ.లక్ష పైగా విలువైన పనులు చేస్తే జిల్లా సమాఖ్యతోపాటు కలెక్టర్ అనుమతి తీసుకొని విత్డ్రా చేయనున్నారు. ఈ నిధుల వినియోగంపై కూడా అన్ని మండలాల్లో కమిటీలకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
ఛైర్పర్సన్గా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్పర్సన్గా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని ఎంపిక చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్గా, మహిళా సమాఖ్య సభ్యులు కమిటీలో ఉన్నారు. పట్టణం, గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ మహిళా సమాఖ్యలు ఉంటే పాఠశాలకు దగ్గరలో ఉన్న సమాఖ్య అధ్యక్షురాలిని ఛైర్మన్గా ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా మహిళా సమాఖ్య సభ్యులుగా ఉన్న విద్యార్థుల తల్లులను తీసుకున్నారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. వీటి కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఈ కమిటీలు పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో సమస్యలను గుర్తించి పనులు చేయించనున్నాయి.
పనులు ప్రారంభిస్తాం
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలుగా 309 ఎంపికయ్యాయి. వీటిలో కమిటీల పర్యవేక్షణలో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. పాఠశాలల్లో కమిటీలు వేసి, బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించాం. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు ఎంపికైన పాఠశాలలకు వెళ్లి పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వం సూచించిన మౌలిక వసతులు కల్పిస్తాం.
- జీఆర్ఆర్ శ్రీధర్కుమార్, జిల్లా కోఆర్డినేటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల