కోతలు లేకుండా..సమస్యలు రాకుండాపకడ్బందీగా యాసంగి ధాన్యం సేకరణ
‘రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలు నియంత్రిస్తున్నాం. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం.
అదనపు పాలనాధికారి శ్యామ్ప్రసాద్లాల్
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ‘రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలు నియంత్రిస్తున్నాం. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. గత తప్పిదాలను అధిమించే ప్రణాళిక రూపొందించా’మని అదనపు పాలనాధికారి శ్యామ్ప్రసాద్లాల్ తెలిపారు. నిబంధనలకు లోబడి ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సీజన్లో కొత్తగా ఐరిస్తో కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ, కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతరత్రా సమస్యలపై ‘న్యూస్టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.
ప్ర : గత అడ్డంకులు అధిగమించి తీసుకునే చర్యలు ఏమిటి?
స : ధాన్యం సేకరణలో పకడ్బందీగా ప్రణాళిక రచించాం. మిల్లర్లు, నిర్వాహకులతో పలు మార్లు సమీక్షించాం. ఎక్కడా ఇబ్బందులు కలిగించరాదని సూచించాం. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం విధించాం. తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించనున్నాం. ప్రస్తుతం 72 మిల్లులకు అనుమతి ఇచ్చాం.
ప్ర : మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలను ఎలా అడ్డుకోబోతున్నారు?
స : ధాన్యం కొనుగోళ్లలో రైతులు నిబంధనలు పాటించాలి. 17 శాతం తేమ, నాణ్యమైన ధాన్యం కోసం తూర్పార పట్టాలి. ధాన్యంలో మట్టిపెళ్లలు లేకుండా చేసేందుకు ప్యాడీ క్లీనర్లను సమకూర్చాం. నిబంధనలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తే చర్యలు తప్పవు. తరుగు పేరిట కోతలు విధించకూడదని స్పష్టం చేశాం.
ప్ర : ఐరిస్ విధానంపై రైతులకు మీరిచ్చే సూచనలు ?
స : ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు కొత్తగా ఐరిస్ విధానం అందుబాటులోకి వచ్చింది. పట్టా పాసుపుస్తకం కలిగిన రైతు ఉండాల్సిన అవసరం లేదు. వారి కుటుంబ సభ్యులు ఉన్నా కొనుగోలు చేస్తాం. ఎలాంటి అపోహ అవసరం లేదు.
ప్రశ్న : జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
సమాధానం : జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ముందుగా 305 కేంద్రాలను ప్రతిపాదించగా రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో 313 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాం. జిల్లాలో 250 సహకారశాఖ, 63 ఐకేపీ కేంద్రాలున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో రైతులకు నీడ, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. తూకం యంత్రాలు, తేమశాతం పరీక్షించే పరికరాలను సమకూర్చా.
ప్ర : హమాలీలు, లారీల కొరతను ఎలా పరిష్కరించనున్నారు?
స : ధాన్యం సేకరణ సమయంలో హమాలీల సమస్య కొంత ఎదురవుతోంది. గ్రామాల్లో హమాలీల వివరాల జాబితా సిద్ధం చేశాం. అవసరమైన చోట ఎక్కువ మందిని తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. లారీల యజమానులతో సమీక్షించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?