నీటి నిర్వహణలో అమృత్ మిత్ర
నగరాలు, పట్టణాల్లో నీటి నిర్వహణ తీరును మెరుగు పరచడంతో పాటు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్ మిత్రల నియామకానికి శ్రీకారం చుట్టారు.
స్వశక్తి మహిళలకు పర్యవేక్షణ బాధ్యతలు
నగరంలో అమృత్ నిధులతో నిర్మించిన ట్యాంకు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం : నగరాలు, పట్టణాల్లో నీటి నిర్వహణ తీరును మెరుగు పరచడంతో పాటు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్ మిత్రల నియామకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ‘అమృత్-02’ నిధులతో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచనున్న నగరాలు, పట్టణాల్లో మొదటగా అమృత్ మిత్రలను ఏర్పాటు చేయనున్నారు. నీటి నిర్వహణ, సరఫరాలో మెరుగైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. తాగునీరు, ఉద్యానవనాలు, మురుగు జలాల శుద్ధి నిర్వహణను మెరుగు పరిచేందుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేలా నిబంధనలను విధించారు. ఈ పనులు స్వశక్తి మహిళల ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి 1500 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశముంది. ‘అమృత్ మిత్ర’ ప్రాజెక్టుల్లో మూడు శాతం నిధులను ప్రత్యేక శిక్షణల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మహిళల సామర్థ్యాల పెంపుదల కోసం వినియోగించనున్నారు. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే మొదటగా అవకాశం ఇవ్వనున్నారు. మొదటి దశలో కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో ‘అమృత్ మిత్ర’ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు.
అర్హతలు
అమృత్ మిత్రల ఎంపిక కోసం సంబంధిత స్వశక్తి సంఘం తప్పనిసరిగా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్(ఎన్.యు.ఎల్.ఎం.)లో నమోదు చేసుకొని ఉండాలి. ఆయా నిబంధనల అమలు, క్రమం తప్పకుండా సమావేశాలు, పొదుపు, అంతర్గత రుణసాయం, రుణాల చెల్లింపు, దస్త్రాల నిర్వహణ తదితర పంచసూత్రాలను పాటిస్తుండాలి. సంబంధిత స్వశక్తి సంఘంలో కనీసం ఒకరు 8వ తరగతికి పైగా చదువుకొని ఉండాలి. సంఘం పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి. సంఘం సభ్యులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండరాదు. గతంలో నీటి నిర్వహణలో పాల్గొన్న స్వశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఉంటుంది. అత్యంత ఉత్సాహంగా పనిచేసి తాగునీరు, మురుగు జలాల శుద్ధి, ఉద్యానవనాల నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన ‘అమృత్ మిత్ర’లకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నారు.
విధి విధానాలు ఇవీ..
- ఎంపిక చేసిన స్వశక్తి సంఘాలను ‘అమృత్ మిత్ర’గా నియమిస్తారు. నీటి నిర్వహణే ప్రధాన అంశంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- ఇంటింటికీ మెరుగైన తాగునీరు అందించేలా పర్యవేక్షించడంతో పాటు ఆయా నివాసాల్లోని మహిళలకు నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తారు. నీటి నిర్వహణలో ఆరోగ్యకర జీవన విధానాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటారు. నీటి వినియోగం మీటర్ల ఏర్పాటు, లీకేజీల నివారణలోనూ ‘అమృత్ మిత్ర’ కీలకపాత్ర పోషించనున్నారు.
- నీటి నిర్వహణ, సరఫరాలో ‘అమృత్ మిత్ర’లు పూర్తి బాధ్యతలను తీసుకుంటూ ప్రజలకు, పట్టణ, స్థానిక సంస్థలకు అనుసంధానంగా వ్యవహరిస్తారు. నీటి దుబారా వల్ల ఎదురయ్యే కష్టాలను ప్రజలకు వివరిస్తారు. నీటి నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా పర్యవేక్షిస్తారు.
- ఉద్యానవనాలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాలు, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్వహణ తీరును ‘అమృత్ మిత్ర’లు పర్యవేక్షించనున్నారు. ఆయా విభాగాల నిర్వహణను మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి దానికి అనుగుణంగా సాంకేతికపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.
ఎంపిక ప్రక్రియ పూర్తయింది
సుచరణ్, ఈఈ, రామగుండం కార్పొరేషన్
నగరంలో అర్హతలు కలిగిన, నిర్వహణలో ఉత్సాహంగా ఉన్న స్వశక్తి సంఘాలను ‘అమృత్ మిత్ర’లుగా ఎంపిక చేశాం. తాగునీటి సరఫరా, మురుగు జలాల శుద్ధి, ఉద్యానవనాలు, నర్సరీల నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు. వారికి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆయా అంశాలను అమలు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం