రచనలతో సామాజిక చైతన్యం
సిరిసిల్లకు చెందిన పలువురు మహిళా సాహితీవేత్తలు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. సామాజిక అంశాలు, మహిళల సమస్యలు, బాలల గురించి రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న సాహితీవేత్తలు
న్యూస్టుడే, సిరిసిల్ల (విద్యానగర్) : సిరిసిల్లకు చెందిన పలువురు మహిళా సాహితీవేత్తలు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. సామాజిక అంశాలు, మహిళల సమస్యలు, బాలల గురించి రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
బాలలను ప్రోత్సహిస్తూ...
సిరిసిల్లకు చెందిన వడ్డేపల్లి సంధ్య రుద్రంగి ఎంపీపీఎస్లో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిసున్నారు. ఆమెకు పాఠశాల, కళాశాల స్థాయి నుంచే సాహిత్యంపై మక్కువ ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రాచ్య భాషల విభాగంలో డా.సిల్మా నాయక్ మార్గదర్శనంలో డా.సినారె సినీ గీతాలు వస్తు శిల్ప వివేచన అనే అంశంగా పీహెచ్డీ చేశారు. యోచన, సంహిత, చేతన, జరీపూల నానీలు, బాల లయలు, చిటపట చినుకులు పుస్తకాలను రచించారు. ఇల్లు కోసం వెతుకులాట పుస్తకాన్ని అనువదించారు. తారంగం తారంగం వంటి అనేక వ్యాసాలు రాశారు. ఓవైపు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూనే బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. బాలలకు చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై తన రచనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బాలలను సాహిత్యం వైపు ప్రోత్సహిస్తున్నారు. సంధ్య లేడీ లెజెండ్ అవార్డు, బీఎస్రాములు స్ఫూర్తి పురస్కారం, మహతి మహిళా శక్తి, పెందోట బాలసాహిత్య, కాళోజీ రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.
మహిళా సాధికారతపై...
సిరిసిల్లకు చెందిన కొలిపాక శోభారాణి విశ్రాంతి సెస్ ఉద్యోగిని. మహిళల సమస్యలు, సంక్షేమం, బాలల గురించి రచనలు చేస్తున్నారు. ఆమెకు ముందు నుంచి సాహిత్యాభిరుచి ఎక్కువ. చలనం కవితా సంపుటి రచించారు. అనేక ఆకాశాలు, స్వయం సిద్ధలో కథలు, తీరొక్క పూలు పుస్తకాలలో కవిత్వం రచించారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాలు అందుకున్నారు. సామాజిక అంశాలతో పాటు మహిళల సమస్యలపై రచనలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
అంశాలే కథా వస్తువులుగా...
సిరిసిల్లకు చెందిన శ్రీమతి తంగళ్లపల్లి కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. సామాజిక అంశాలు, ఆధ్యాత్మిక రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వేదాంత మహాసభలు జరిగిన సమయంలో ‘39వ వేదాంత విజ్ఞాన మహాసభలు’ పుస్తకం రచించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రయాణం’ అనే పుస్తకాన్ని అనువదించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘నెల్లూరు కేశవస్వామి కథలు, నిజాం యుగాంత పరిణామాలు’ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు రచించి ప్రశంసలు అందుకున్నారు. ఎక్కువగా సమాజాన్ని చైతన్యవంతం చేసే రచనలు రాస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం