ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం
మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ముగ్గురికి తీవ్ర గాయాలు
మెట్పల్లి, కోరుట్ల, న్యూస్టుడే: మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని ముస్లింపురకు చెందిన మిర్జాఖాజాపాషా(38) కుటుంబ సభ్యులతో కలిసి పనినిమిత్తం కోరుట్లకు వెళ్లారు. ఇద్దరు కూతుళ్లు అయేషా, అలీషాతో కలిసి ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి బయలుదేరారు. కోరుట్లకు చెందిన తోగిటి వెంకటేశ్(28), ఇందూరి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వెళ్లి కోరుట్లకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో మారుతినగర్ శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మిర్జాఖాజాపాషా, వెంకటేశ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకోగా అంబులెన్స్లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలైన శ్రీనివాస్, అయోష, అలీషాను 108లో మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించారు. మెట్పల్లి ఎస్సై చిరంజీవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
బావిలో పడి యువకుడి మృతి
మర్రిపల్లిలో విషాదం
వేములవాడ గ్రామీణం, సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: హైదరాబాద్ వెళ్లేందుకు వాహనంపై బయలుదేరిన విద్యార్థి దారిలో నిద్రావస్థను తప్పించుకునేందుకు పిట్ట గోడపై పడుకోగా పక్కనున్న బావిలో పడిపోయి మృత్యువు పాలయ్యాడు. సిద్దిపేట వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రాచర్ల మల్లేశంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయికృష్ణ కౌశిక్ (22) హైదరాబాద్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. గురువారం రాత్రి పది గంటలకు తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ బయల్దేరాడు. సిద్దిపేట పరిధిలోని ఇమాంబాద్ గ్రామ శివారులోకి రాగానే నిద్ర రావటంతో వాహనాన్ని ఆపి వ్యవసాయ బావికి ఆనుకొని ఉన్న గోడపై నిద్రించాడు. గాఢ నిద్రలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్రేన్ సహాయంతో బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలకని వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
నకిలీ ఉద్యోగ నియామక పత్రంతో పట్టుబడ్డ యువతి
కోరుట్ల, న్యూస్టుడే: నకిలీ ఉద్యోగ నియామక పత్రంతో ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన ఓ యువతిని గుర్తించి పోలీసులకు అప్పగించిన ఘటన శుక్రవారం కోరుట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కోరుట్ల పట్టణానికి చెందిన ఓ మహిళ ఎంఎల్టీ పూర్తి చేసింది. శుక్రవారం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామక పత్రాలను తీసుకుని పట్టణంలోని అల్లమయ్యగుట్ట వద్దనున్న అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్కు అనుమానం వచ్చి వెంటనే జిల్లా వైద్యాధికారికి విషయం తెలిపారు. ఇటీవల ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఎవరికి ఉద్యోగ నియామక పత్రం అందజేయలేదని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువతిని, నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు కథలాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద పొందినట్లు విశ్వసనీయ సమాచారం.
విశ్రాంత ప్రిన్సిపల్కు జైలుశిక్ష
కరీంనగర్ న్యాయవార్తలు, న్యూస్టుడే : కోర్టు ఉత్తర్వుల ప్రకారం సకాలంలో దావ దాఖలు చేసిన వ్యక్తికి డబ్బు చెల్లించకపోవడంతో ప్రతి వాది అయిన కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ను 30 రోజులపాటు జైలుకు తరలించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాది విశ్వప్రసాద్ కథనం మేరకు.. కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన విశ్రాంత లెక్చరర్ వెంగళ రమణయ్య హుస్నాబాద్ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ విజయ మారుతి ఒకప్పుడు స్నేహితులు. విజయమారుతి తన అవసరాల నిమిత్తం రమణయ్య వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీనిపై రమణయ్య కోర్టులో దావా దాఖలు చేయగా వడ్డీతో సహా డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం డబ్బును విజయమారుతి చెల్లించకపోవడంతో మళ్లీ రమణయ్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విజయమారుతి డబ్బు చెల్లించకపోవడంతో 30 రోజులపాటు జైలు(సివిల్ ప్రిజిన్)కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రమణయ్య, విజయమారుతి ఇద్దరు ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే